ETV Bharat / bharat

దేశంలో కొవిడ్​ పరిస్థితులపై నేడు మోదీ సమీక్ష

author img

By

Published : Dec 23, 2021, 5:36 AM IST

modi
మోదీ

PM Modi Meeting on covid-19 situation: దేశంలో ఒమిక్రాన్​ వ్యాప్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో నేడు(డిసెంబర్ 23) ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా కొవిడ్-19 పరిస్థితిని సమీక్షించనున్నారు.

PM Modi Meeting on covid-19 situation: దేశవ్యాప్తంగా ఒమిక్రాన్​ కలకలం రేపుతోంది. ఈ వేరియంట్ కేసులు 250కి చేరువైన నేపథ్యంలో పలు రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. అయితే.. గురువారం దేశవ్యాప్తంగా కొవిడ్-19 పరిస్థితిపై సమీక్షించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ మేరకు మోదీ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.

దేశంలో బుధవారం నాటికి 213 మందికి ఒమిక్రాన్ సోకినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 15 రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్​ కేసులు వెలుగుచూసినట్లు పేర్కొంది.

బూస్టర్​ డోసు కావాలంటూ..

రెండు డోసుల కొవిడ్​ టీకా తీసుకున్నవారు బూస్టర్​ డోసు తీసుకునేలా ప్రభుత్వం అనుమతించాలని పలుచోట్ల డిమాండ్​ వ్యక్తమవుతోంది. చాలా దేశాల్లో బూస్టర్​ డోసు పంపిణీ జరుగుతోందని కొందరు చెబుతున్నారు. భారత్​ కూడా అదే దిశగా వెళ్లాలని ఆశిస్తున్నారు.

డెల్టా కంటే మూడు రెట్లు వేగంగా..

ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఒమిక్రాన్‌పై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను మరోసారి అప్రమత్తం చేసింది. డెల్టా రకంతో పోలిస్తే ఈ కొత్త వేరియంట్‌ కనీసం మూడు రెట్లు అధికంగా వ్యాప్తి చెందుతోందని పేర్కొంది. అందువల్ల మరింత దూరదృష్టితో వ్యవహరించి డేటాని సమగ్రంగా విశ్లేషించాలని, డైనమిక్‌గా నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ సూచించారు. మంగళవారం సాయంత్రం ఆయన రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల అధికార యంత్రాంగాలకు లేఖలు రాశారు. ఒమిక్రాన్‌ని కట్టడి చేసేందుకు తక్షణమే వార్‌రూమ్‌లను యాక్టివేట్‌ చేయాలన్నారు.

ఇదీ చదవండి:

కొవిడ్​ టీకా తీసుకోని ఉద్యోగులకు జీతం కట్​!

'బూస్టర్ డోసు ఎప్పుడు పంపిణీ చేస్తారు?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.