ETV Bharat / bharat

'భారత్​కు కావాల్సింది వికాసం.. విప్లవం కాదు'

author img

By

Published : Dec 17, 2021, 12:39 PM IST

Updated : Dec 17, 2021, 1:02 PM IST

Mayors Conference 2021: వారణాసి వేదికగా జరుగుతున్న మేయర్స్​ కాన్ఫరెన్స్​ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. భారత్​కు వికాసం అవసరమని, విప్లవం కాదని వ్యాఖ్యానించారు. స్వచ్ఛత అభియాన్​ పట్ల నిర్లక్ష్యం వహించిన నగరాల జాబితా తయారు చేసి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.

mayors conference 2021
ప్రధాని నరేంద్ర మోదీ

Mayors Conference 2021: 'న్యూ అర్బన్​ ఇండియా' నేపథ్యంలో నిర్వహిస్తున్న అఖిల భారత మేయర్ల సదస్సును ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రస్తుతం భారత్​కు కావాల్సింది వికాసమే కానీ విప్లవం కాదన్నారు. మేయర్లు తమ నగరాలను అత్యంత స్వచ్ఛత కలిగినవిగా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

స్వచ్ఛత అభియాన్​ పట్ల నిర్లక్ష్యం వహించిన నగరాల జాబితా తయారు చేసి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు మోదీ. స్వచ్ఛతలో అగ్రస్థానంలో నిలిచిన నగరాలతో పాటు అందుకు కృషి చేసిన ఇతర ప్రాంతాలనూ గుర్తించాలని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్​ సింగ్​ పురికి సూచించారు.

ఉత్తర్​ప్రదేశ్​లోని వారణాసి వేదికగా శుక్రవారం జరిగిన ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన 120 మంది మేయర్లు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : 'కలిసి పోరాటం చేశాము.. అణచివేత శక్తులను ఓడించాము'

Last Updated :Dec 17, 2021, 1:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.