ETV Bharat / bharat

ఆస్పత్రిలో పవర్​ కట్​.. ఆక్సిజన్​ సరఫరా నిలిచి రోగి మృతి

author img

By

Published : Oct 29, 2022, 8:57 PM IST

patient died due to lack of oxygen in jharkhand
patient died due to lack of oxygen

వైద్యుల నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఆక్సిజన్​ అందక ఓ రోగి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆగ్రహించిన కుటుంబసభ్యులు ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు. అసలేం జరిగందంటే?

ఝార్ఖండ్​లోని గిరిధి జిల్లాలో విషాదం నెలకొంది. ఆక్సిజన్​ సరఫరా నిలిచిపోవడం వల్ల ఓ వ్యక్తి ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయాడు.
వివరాల్లోకి వెళ్తే..
జిల్లాలోని జమాతాడా పంచాయతీ పరిధిలోని పీడితాండ్​కు చెందిన టుకావన్​ అనే వ్యక్తికి గురువారం రాత్రి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది. ఆందోళన చెందిన కుటుంబసభ్యులు వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించారు. దాదాపు 15 నిమిషాల వరకు ఆస్పత్రిలో వైద్యులు అందుబాటులోకి దొరకలేదు. కాసేపటి తర్వాత ఓ వైద్యుడు అక్కడికి వచ్చి టుకావన్​ను పరీక్షించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని, హుటాహుటిన మరో ఆస్పత్రికి తరలించాలని సూచించారు.

సమయానికి ఆంబులెన్స్​ అందుబాటులో లేకపోవడం వల్ల ఆస్పత్రి సిబ్బంది పేషంట్​కు కృత్రిమంగా ఆక్సిజన్​ సరఫరా చేయడం ప్రారంభించారు. అయితే కరెంట్​ కోత వల్ల మధ్యలో ఆక్సిజన్​ సరఫరా నిలిచిపోయింది. ​ఇంధనం లేని కారణంగా ఆస్పత్రి సిబ్బంది జన​రేటర్​ను కూడా ఆన్​ చేయలేదు. దీంతో సమయానికి ఆక్సిజన్​ అందక దాదాపు 20 నిమిషాలు మృత్యువుతో పోరాడిన టుకావన్​ మృతి చెందాడు. ఆగ్రహించిన కుటుంబసభ్యులు ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు. మృతుడి కుటుంబసభ్యులకు గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు మద్దతు పలికారు. టుకావన్​ మృతికి కారణమైన ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి: కంప్యూటర్​ క్లాస్ నుంచి​ వస్తున్న యువకుడు దారుణ హత్య.. గేదెనూ వదలని కామాంధుడు!

మాజీ సీఎం, ఎమ్మెల్యే వర్గాల మధ్య గొడవ కుర్చీలతో కొట్టుకున్న కార్యకర్తలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.