ETV Bharat / bharat

20 మంది భారత జాలర్లను అప్పగించిన పాక్

author img

By

Published : Jan 25, 2022, 5:15 AM IST

fisherman
జాలర్లు

Pak Hand Over Fisherman: తమ భూభాగంలోకి ప్రవేశించారంటూ గతంలో అరెస్టు చేసిన 20 మంది జాలర్లను తిరిగి భారత్​కు అప్పగించింది పాకిస్థాన్. సోమవారం వాఘా సరిహద్దు నుంచి మత్య్సకారులు ఇండియా చేరుకున్నారు.

Pak Hand Over Fisherman: పాకిస్థాన్​ అధికారులు అరెస్టు చేసిన 20 మంది భారత మత్స్యకారులు సోమవారం విడుదలయ్యారు. కరాచీలోని లాంధీ జైలులో నాలుగేళ్లు శిక్ష ముగించుకుని.. వాఘా సరిహద్దు ద్వారా తిరిగి భారత్​కు చేరుకున్నారు. ఈ మేరకు పాకిస్థాన్​కు చెందిన సామాజిక సంక్షేమ సంస్థ.. ఈధి ఫౌండేషన్ స్పష్టం చేసింది. లీగల్ ఫార్మాలిటీస్​ ముగిశాక జాలర్లను బీఎస్​ఎఫ్ అధికారులకు అప్పగించినట్లు పేర్కొంది.

"జైలు శిక్ష అనంతరం ఆదివారం 20 మంది జాలర్లు విడుదలయ్యారు. సోమవారం అట్టారీ-వాఘా సరిహద్దు వద్ద వారిని భారత జవాన్లకు అప్పగించాం." అని ఈధి ఫౌండేషన్​ ప్రతినిధి మహమ్మద్ యూనిస్ పేర్కొన్నారు.

fishermen
మత్స్యకారులు

ఇస్లామాబాద్​లోని భారత హైకమిషన్.. అరెస్టయిన జాలర్లకు 'ఎమర్జెన్సీ ట్రావెల్ సర్టిఫికేట్' ఇచ్చిన తర్వాత వారు భారత్​లోకి ప్రవేశించారు. అనంతరం మత్స్యకారులకు కొవిడ్-19 సహా ఇతర వైద్య పరీక్షలు నిర్వహించినట్లు భారత అధికారులు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

40 మంది భారత జాలర్ల విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.