ETV Bharat / bharat

నవాజ్​ షరీఫ్​ను నేరస్థుడిగా ప్రకటించిన పాక్​ కోర్టు

author img

By

Published : Dec 3, 2020, 5:43 AM IST

పాకిస్థాన్​ మాజీ ప్రధాని నవాజ్​ షరీఫ్​ను నేరస్థుడిగా ప్రకటించింది ఇస్లామాబాద్​ హైకోర్టు. పలుమార్లు సమన్లు పంపించినా ఆయన కోర్టు ఎదుట హాజరు కాకపోవడం వల్ల ఈ తీర్పు ఇచ్చింది.

Pak court declares Nawaz Sharif proclaimed offender
నవాజ్​ షరీఫ్​ను నేరస్థుడిగా ప్రకటించిన ఇస్లామాబాద్​ హైకోర్టు

పాకిస్థాన్​ మాజీ ప్రధాని నవాజ్​ షరీఫ్​ను ఇస్లామాబాద్​ హైకోర్టు నేరస్థుడిగా ప్రకటించింది . అల్​ అజీజియా, అవెన్​ఫీల్డ్ గ్రాఫ్ట్ కేసులకు సంబంధించిన కేసుల్లో నవాజ్ షరీఫ్​ అప్పీళ్లపై జస్టిస్​ అమీర్​ ఫరూఖ్​, జస్టిస్​ మొహ్సిన్​ అక్తర్​లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. నోటీసులు పంపినప్పటికీ న్యాయస్థానం ఎదుట షరీఫ్​ హాజరు కాకపోవడంపై ధర్మాసం అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై అధికారులను వివరణ కోరింది.

లండన్​, లాహోర్​లలోని షరీఫ్​ నివాసానికి సమాచారం పంపినట్లు విదేశాంగ శాఖ, అంతర్గత వ్యవహారాలు శాఖ కార్యాలయ అధికారులు.. కోర్టుకు నివేదించారు. అయినప్పటికీ షరీఫ్​ హాజరు కాకపోవడం వల్ల ఆయనను అపరాధిగా ప్రకటిస్తూ ధర్మాసనం తీర్పు ఇచ్చింది.

అప్పటినుంచి అక్కడే..

గుండె సంబంధిత చికిత్స కోసం లాహోర్​ హైకోర్టు అనుమతితో గతేడాది నవంబర్​లో లండన్​ వెళ్లిన షరీఫ్​.. అక్కడే తలదాచుకుంటున్నారు.సెప్టెంబర్​ 15న ఆయనపై నాన్​ బెయిలబుల్ అరెస్ట్​ వారెంట్​ జారీ చేసింది న్యాయస్థానం. కానీ, షరీఫ్​ ఆ వారెంట్​ను ​ తిరస్కరించారు.

ఇదీ చూడండి:భారత్​ నుంచి చైనాకు బియ్యం ఎగుమతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.