ETV Bharat / bharat

'హిజాబ్ ధరించిన మహిళ దేశ ప్రధాని అవుతుంది'

author img

By

Published : Feb 13, 2022, 10:16 PM IST

Owaisi
ఒవైసీ

Owaisi On Hijab: దేశంలో హిజాబ్​ అంశం ముదురుతున్న నేపథ్యంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్​ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. హిజాబ్ ధరించిన మహిళ ఏదో ఒకరోజు దేశ ప్రధానమంత్రి అవుతుందని అన్నారు.

Owaisi On Hijab: హిజాబ్ ధరించిన మహిళ ఏదో ఒకరోజు దేశ ప్రధానమంత్రి అవుతుందని ఎమ్‌ఐఎమ్‌ అధినేత అసదుద్దీన్ ఒవైసీ జోస్యం చెప్పారు. కర్ణాటకలో హిజాబ్ ధరించిన విద్యార్థినులను విద్యాసంస్థల్లోకి అనుమతించకపోవడంపై మండిపడుతూ తన ట్విటర్ ఖాతాలో ఓ వీడియోను.. ఒవైసీ పోస్టు చేశారు.

హిజాబ్ ధరించిన మహిళలు తప్పకుండా కళాశాలలకు వెళ్లి.. కలెక్టర్లు, మేజిస్ట్రేట్లు, వైద్యులు, వ్యాపారవేత్తలు అవుతారని ఆయన పేర్కొన్నారు. తాను బతికి ఉన్నా, లేకున్నా.. ఏదో ఒకరోజు హిజాబ్ ధరించిన మహిళ దేశ ప్రధాని అవుతుందని, ఈ విషయాన్ని అంతా గుర్తుపెట్టుకోవాలని అసదుద్దీన్ తెలిపారు.

ప్రజల దృష్టిని మరల్చేందుకే..

ప్రజల దృష్టిని మరల్చేందుకు భాజపా.. హిజాబ్​ వివాదాన్ని సృష్టించిందన్నారు ​ఒవైసీ.

"యూనిఫామ్​ ధరించడం అనేది విద్యార్థి స్వచ్ఛంద నిర్ణయమే కానీ తప్పనిసరి కాదు. ఇదే విషయాన్ని బాబా సాహేబ్​ అంబేడ్కర్​ స్పష్టం చేశారు. యూనిఫామ్​లు అందరికీ ఒక్కలా ఉండవని.. అవి విద్యార్థుల మతాల ఆధారంగా ఉండే అవకాశం ఉందని ప్రధాని మోదీ అర్థం చేసుకోవాలి."

-అసదుద్దీన్​ ఒవైసీ, ఎంఐఎం అధినేత

ఉత్తరాఖండ్​ ఎన్నికల్లో ఓటమిని చవిచూస్తామనే భయంతో ఆ పార్టీ ఈ చర్యలకు పాల్పడుతోందని అసదుద్దీన్​ ఒవైసీ ఆరోపించారు.

ఇదీ చూడండి: రెండో దశకు యూపీ సిద్ధం- ముస్లింలు, రైతుల ఓట్లే కీలకం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.