ETV Bharat / bharat

దీపావళి కోసం స్పెషల్ గోల్డెన్​ స్వీట్- కిలో రూ.11వేలు!

author img

By

Published : Nov 1, 2021, 7:33 PM IST

Updated : Nov 1, 2021, 10:48 PM IST

Suvarna Mithai
బంగారంతో చేసిన స్వీట్

దీపావళికి ముందు వచ్చే పర్వదినం ధనత్రయోదశి సందర్భంగా.. దేశవ్యాప్తంగా అనేకచోట్ల బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. ఈ క్రమంలో మహారాష్ట్రలోని అమరావతికి చెందిన ఓ మిఠాయి దుకాణం.. పూర్తిగా బంగారు పూతతో స్వీటును తయారు చేసింది.

దీపావళి కోసం స్పెషల్ గోల్డెన్​ స్వీట్- కిలో రూ.11వేలు!

దీపావళి సందర్భంగా మహారాష్ట్రలోని అమరావతికి చెందిన ఓ స్వీటు షాపు.. సరికొత్త మిఠాయిను తయారుచేసింది. పూర్తిగా 24 క్యారెట్ల బంగారు పూతతో చేసిన స్వీటును 'సువర్ణ కలష్​' పేరుతో మార్కెట్​లో విక్రయిస్తోంది. దీని ధర కూడా ఎక్కువే. కేజీ స్వీటు ధర రూ.11,000.

మొత్తం 12 కేజీల స్వీటును తయారు చేసినట్లు రఘువీర్ మిఠాయి షాపు నిర్వాహకుడు తేజస్ పోపత్ తెలిపారు. ఇందుకోసం రాజస్థాన్​ నుంచి నిపుణుల్ని రప్పించినట్లు వివరించారు.

Suvarna Mithai
బంగారు పూతతో చేసిన స్వీట్

సోమవారం నాటికి 6-7కేజీల స్వీట్స్​ను విక్రయించామన్నారు. కొవిడ్-19 కారణంగా గతేడాది ఈ ప్రత్యేక స్వీట్​ను తయారు చేయలేదని చెప్పారు రఘువీర్.

ఇదీ చూడండి: అంబులెన్స్​కు దారిచ్చిన సీఎం కాన్వాయ్​.. ముఖ్యమంత్రే స్వయంగా...

Last Updated :Nov 1, 2021, 10:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.