ETV Bharat / bharat

Omicron India: దిల్లీలో 10 ఒమిక్రాన్ కేసులు.. కర్ణాటకలో మరో నలుగురికి..

author img

By

Published : Dec 16, 2021, 8:24 PM IST

Updated : Dec 16, 2021, 10:09 PM IST

Omicron India: దిల్లీలో ఇప్పటివరకు 10 మందికి ఒమిక్రాన్​ వేరియంట్​ సోకినట్లు ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. వీరందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు చెప్పారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ ప్రబలుతోంది. ఇండోనేసియాకు కూడా ఈ వేరియంట్ వ్యాపించింది.

10 Omicron cases detected in Delhi, ఒమిక్రాన్ కేసులు
ఒమిక్రాన్ కేసులు

Omicron India: దిల్లీలో మొత్తం 10 ఒమిక్రాన్​ వేరియంట్ కేసులు వెలుగుచూసినట్లు ఆరోగ్యమంత్రి సత్యేంద్రజైన్ తెలిపారు. ఈ వైరస్ సోకిన వారిలో ఒక్కరు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా మిగతా వారు చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వివరించారు. ఎవరిలోనూ తీవ్ర లక్షణాలు కనిపించలేదన్నారు.

లోక్​నాయక్ ఆస్పత్రిలో మొత్తం 40 మంది కరోనా అనుమానితులు ప్రత్యేక వసతులతో ఐసోలేషన్లో ఉన్నట్లు జైన్ వెల్లడించారు. వీరిలో 38మందికి పాజిటివ్​గా తేలిందని చెప్పారు. ఒమిక్రాన్​ వేరియంట్​ సోకిన 10మందిలో ఒకరు కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు వివరించారు. అంతర్జాతీయ పర్యటకులే బాధితులుగా ఉంటున్నారని పేర్కొన్నారు.

Karnataka omicron

కర్ణాటకలో గురువారం ఒక్కరోజే 4 ఒమిక్రాన్​ కేసులు వెలుగు చూశాయి. బ్రిటన్​, యూకే నుంచి వచ్చిన ఇద్దరికి, దిల్లీ నుంచి వచ్చిన మరో ఇద్దరికి పాజిటివ్​గా తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8కి చేరింది.

Gujarat omicron cases

గుజరాత్​లో గురువారం మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. మెహ్సానా జిల్లా విజాపుర్ గ్రామానికి చెందిన ఆరోగ్య కార్యకర్తకు పాజిటివ్​గా తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఐదుకు పెరిగింది. బాధితురాలికి వాద్​నగర్​ ప్రభుత్వ ఆస్పత్రిలో ఐసోలేషన్​ ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. ఈమె విదేశాల్లో పర్యటించలేదని, కానీ జింబాబ్వే నుంచి వచ్చిన బంధువును కలిసిందని అధికారులు తెలిపారు. డిసెంబర్ 10న ఈమెకు పాజిటివ్​ రాగా.. శాంపిల్స్​ను జినోమ్ సీక్వెన్సింగ్ పంపగా.. గురువారం ఒమిక్రాన్ వేరియంట్ అని తేలింది.

ఆరోగ్య కార్యకర్త భర్త ఇటీవలే మరణించారు. కుటుంబాన్ని పరామర్శించేందుకు అతని సోదరి, బావ జింబాబ్వే నుంచి వచ్చారు. అయితే కరోనా పరీక్షలో వారికి నెగెటివ్​ వచ్చింది.

West bengal omicron news

బంగ్లాదేశ్ నుంచి బంగాల్​కు వచ్చిన అనంతరం కరోనా పాజిటివ్​గా తేలిన ఓ వ్యక్తికి జినోమ్ సీక్వెన్సింగ్​లో ఒమిక్రాన్​ నెగెటివ్​ వచ్చిందని అధికారులు తెలిపారు. ఉత్తర 24 పరగణాలు జిల్లాకు చెందిన ఇతనికి డెసెంబర్ 10న నిర్వహించిన పరీక్షల్లో కరోనా ఉన్నట్లు తేలింది. జినోమ్ సీక్వెన్సింగ్​లో డెల్టా వేరియంట్​ సోకినట్లు నిర్ధరణ అయింది.

కొత్త కేసులతో కలిపి భారత్​లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 70 దాటింది.

మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్​ ప్రబలుతోంది. ఇండోనేసియాలో తొలి కేసు వెలుగుచూసింది. రాజధాని జకార్తాలో ఓ ఆస్పత్రిలో పారిశుద్ధ్య కార్మికురాలికి ఈ వేరియంట్ సోకింది. దీంతో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని అధ్యక్షుడు జోకో విడోడో విజ్ఞప్తి చేశారు. అత్యవసరమైతేనే విదేశీ ప్రయాణాలుండాలని సూచించారు.

japan omicron news

జపాన్ రాజధాని టోక్యోలోనూ తొలి ఒమిక్రాన్ కేసు బయటపడింది. డిసెంబర్​ 8న విదేశాల నుంచి వచ్చిన ఇతనికి పరీక్షలు చేయగా నెగెటివ్​గా తేలింది. అయితే ఐసోలేషన్​కి వెళ్లిన మరునాడే జ్వరం రావడం వల్ల మరోసారి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్​ వచ్చింది. దీంతో దేశంలో ఒమిక్రాన్​ బాధితుల సంఖ్య 34కు చేరింది.

బ్రిటన్లో ఒమిక్రాన్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఫ్రాన్స్​ అప్రమత్తమైంది. బ్రిటన్ ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. ఆ దేశం నుంచి వచ్చేవారు రెండు రోజులు ఐసోలేషన్​లో ఉండాలని ఆదేశించింది.

ఇదీ చదవండి: అమ్మడం కోసమే పిల్లల్ని కన్న తండ్రి- రూ.31లక్షలకు ఐదుగురు!

Last Updated :Dec 16, 2021, 10:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.