ETV Bharat / bharat

'రొమ్ము క్యాన్సర్​కు మందు.. నాలుగో దశలోనూ నయం.. భారత శాస్త్రవేత్త ప్రతిభ!'

author img

By

Published : Jun 28, 2022, 1:19 PM IST

odisha scientist find breat cancer medicine
odisha scientist find breat cancer medicine

ఒడిశా భువనేశ్వర్​కు చెందిన శాస్త్రవేత్త డాక్టర్​ సందీప్​ కుమార్​ మిశ్రా రొమ్ము క్యాన్సర్​కు మందును కనిపెట్టారు. ఈ ఔషధం క్యాన్సర్​ నాలుగో దశలో ఉన్న రోగులకు ఇచ్చినా చక్కటి పనితీరును కనబరిచిందని డాక్టర్​ మిశ్రా తెలిపారు. ప్రస్తుతం క్లినికల్​ ట్రయల్స్ కోసం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు.

రొమ్ముక్యాన్సర్.. ప్రస్తుతం మహిళలను భయపెడుతున్న వ్యాధుల్లో ముఖ్యమైనది. మన దేశంలో ఏటా దీని బారిన పడేవారు లక్షల్లో ఉంటున్నారంటే ఈ వ్యాధి తీవ్రత ఎంతో అర్థం చేసుకోవచ్చు. ఈ తరుణంలోనే ఒడిశా భువనేశ్వర్​కు చెందిన శాస్త్రవేత్త డాక్టర్​ సందీప్​ కుమార్​ మిశ్రా రొమ్ము క్యాన్సర్​కు మందును కనిపెట్టారు. ఈ ఔషధం క్యాన్సర్​ నాలుగో దశలో ఉన్న రోగులకు ఇచ్చినా చక్కటి పనితీరును కనబరిచిందని ఆయన తెలిపారు.

రొమ్ము క్యాన్సర్​ నయం అయ్యే మందు కోసం పరిశోధనలు చేసిన మిశ్రా.. 'అర్టెమిసినిన్​' అనే ఔషధాన్ని అభివృద్ధి చేశారు. ఇది రోగుల్లో క్యాన్సర్​ కణాలు పెరగకుండా కట్టడి చేస్తుందని చెప్పారు. ప్రస్తుతం ఆయన భువనేశ్వర్​లోని ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ లైఫ్​ సైన్సెస్​ క్యాన్సర్​ డిపార్ట్​మెంట్​లో మాలిక్యూలర్​ ఆంకాలజీ హెడ్​గా పనిచేస్తున్నారు.

odisha scientist find breat cancer medicine
శాస్త్రవేత్త డాక్టర్ సందీప్ కుమార్ మిశ్రా

"రొమ్ము క్యాన్సర్​కు మందును కనిపెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఇది క్యాన్సర్​ నాలుగో దశలో ఉన్న వారికి ఇచ్చినా చక్కటి పనితీరు కనబరిచింది. ఈ పరిశోధనలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఒక శాస్త్రవేత్తగా సమాజానికి నా వంతు సహాయం చేయడం నా విధి."

-సందీప్​ కమార్ మిశ్రా, శాస్త్రవేత్త

సందీప్​ కుమార్ మిశ్రా కనుగొన్న విషయాలు నేచర్​ గ్రూప్​ ఆఫ్ జర్నల్స్​కు చెందిన బ్రిటీష్​ జర్నల్ ఆఫ్​ క్యాన్సర్​లో ప్రచురితమయ్యాయి. ఈ ఔషధం రొమ్ము క్యాన్సర్​తో బాధ పడుతున్న మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందని మిశ్రా తెలిపారు. తాను చేసిన ఈ పరిశోధన బీఎంసీ క్యాన్సర్​ ఇంటర్​నేషనల్​ జర్నల్​ సైతం ఆమోదించిందని అనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం క్లినికల్​ ట్రయల్స్ కోసం సిద్ధంగా ఉందని.. ​ఎయిమ్స్ భువనేశ్వర్​, కేఐఐటీ సంయుక్తంగా పనిచేస్తున్నాయని చెప్పారు. ఈ పరిశోధనలో తనకు సహకరించిన వారందరికీ డాక్టర్ సందీప్​ మిశ్రా కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటి వరకు అనేక అంతర్జాతీయ వేదికలపై తన పరిశోధనలపై ప్రసంగించినట్లు ఆయన వెల్లడించారు.

ఇదీ చదవండి: స్కానింగ్​లో ఇద్దరు.. డెలివరీలో నలుగురు.. డాక్టర్లు షాక్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.