ETV Bharat / bharat

'మిమ్మల్ని వదిలి నేను వెళ్లను డాక్టర్​'.. భాష తెలియని చోట వైద్యుల ప్రేమకు రోగి ఫిదా

author img

By

Published : Dec 2, 2022, 2:01 PM IST

Updated : Dec 2, 2022, 2:18 PM IST

ఎదుటివారి బాధలను అర్థం చేసుకోవడానికి మహాత్ములే కానవసరం లేదు.. మంచి మనసుంటే చాలన్నది మరోసారి రుజువైంది. పక్కవారి కష్టాన్ని మన కష్టంలా భావించి సాయపడాలంటే మనిషికి భాషతో సంబంధం లేదు.. అర్థం చేసుకునే మనస్సు ఉంటే చాలు. భాష అర్థం కాకపోయినా సరే.. దీన స్థితిలో పడి ఉన్న ఓ వ్యక్తిని గుర్తించిన డాక్టర్లు​ అతనికి పునర్జన్మ ప్రసాదించారు.

no language barrier for humanism in india
no language barrier for humanism in india

భాష రాకపోయినా సరే ఓ అనాథకు.. 27 రోజులు వైద్యం చేసిన డాక్టర్లు, సిబ్బంది

డబ్బులు సంపాదించలేకపోతున్నందున మూడేళ్ల క్రితం.. కన్న బిడ్డలే కాదనుకుని ఓ వృద్ధుడ్ని రైల్వే స్టేషన్​లో విడిచిపెట్టారు. అనంతరం అక్కడే భిక్షాటన చేస్తూ జీవనం సాగించిన ఆ వ్యక్తి.. అనారోగ్యం కారణంగా కదలలేని స్థితిలో ఉన్నాడు. అతడ్ని గుర్తించిన ఓ డాక్టర్​.. వెంటనే ఆస్పత్రిలో చేర్చి దగ్గరుండి వైద్యం చేయడం ప్రారంభించారు. అయితే వారికి ఓ సమస్య వచ్చింది. రోగి భాష డాక్టర్​కు అర్థం కాలేదు. దీంతో వారి మధ్య మాటలు లేకుండా పోయాయి. అయినా సరే సిబ్బంది అతడి బాధను గుర్తించి.. 27 రోజులపాటు దగ్గరుండి సేవలు చేశారు. చివరకు రోగి మాట్లాడే భాష తెలిసిన ఆస్పత్రి సిబ్బంది ఒకరు.. మాటలు కలిపారు. అతడి బాధను తెలుసుకుని చలించిపోయాడు.

No Language barrier for humanism
సాటి రోగులకు వీడ్కోలు చెప్తున్న రాజు

కర్ణాటకలోని బీదర్​ జిల్లాకు చెందిన రాజురామ్​ గౌడ అనే వృద్ధుడ్ని అతని కుమారుడు మూడేళ్ల క్రితం మహారాష్ట్ర ఔరంగాబాద్​ రైల్వే స్టేషన్​లో విడిచిపెట్టారు. దీంతో అక్కడే రాజు భిక్షాటన చేస్తూ జీవనం సాగించేవాడు. కొంతకాలంగా ఆరోగ్యం దెబ్బతిని కదలలేని స్థితిలో ఉన్న రాజును.. మహారాష్ట్రకు చెందిన డాక్టర్ బాలాసాహెబ్ శిందే గుర్తించి ఆస్పత్రిలో చేర్పించి. అతడికి అన్ని పరీక్షలు చేసి తగిన వైద్యం అందించారు. వైద్యులకు తన భాష అర్థం కాకపోయనా సరే తనపై చూపించిన ప్రేమకు.. వారిని దేవుళ్లుగా కొనియాడాడు రాజు. 27 రోజుల పాటు ఆస్పత్రిలో ఉండి.. కోలుకున్నాసరే అక్కడనుంచి వెళ్లడానికి నిరాకరించాడు. ప్రస్తుతం తనకు అందరూ ఉన్నా అనాథగా మారానని రాజు వారితో వాపోయాడు. దీంతో వైద్యబృదం దగ్గరుండి మరీ రాజును ఓ ఆశ్రమంలో చేర్పించారు. అక్కడ నుంచి వెళ్లే సమయంలో రాజు కన్నీటితో అందరికీ వీడ్కోలు పలికాడు.

ఇవీ చదవండి:

ఆడపిల్లగా పుట్టడమే పాపం.. 9 నెలల చిన్నారిని చంపిన తండ్రి.. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తల్లి..

ఓవైపు పుట్టెడు దుఃఖం.. మరోవైపు పేదరికం.. తోపుడు బండిపైనే ఇంటికి మృతదేహం

Last Updated :Dec 2, 2022, 2:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.