పంజాబ్ కాంగ్రెస్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా నియామకమైన కొత్త కార్యవర్గం తొలిసారి సమావేశమైంది. పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీపీసీసీ) అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ, కార్యనిర్వాహక అధ్యక్షుడు కుల్జిత్ సింగ్ నగ్రా, మాజీ పీపీసీసీ అధ్యక్షుడు సునీల్ జఖర్ సహా ఇతర నేతలు.. ఛండీగఢ్లోని ఆ రాష్ట్ర మంత్రి త్రిపట్ రాజిందర్ సింగ్ బజ్వా నివాసంలో భేటీ అయ్యారు. అనంతరం నేతలంతా.. ఫొటోలకు పోజులిచ్చారు.
![Punjab Congress president Navjot Singh Sidhu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12506542_ppcc1.jpg)
![Punjab Congress president Navjot Singh Sidhu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12506542_ppcc3.jpg)
ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలు, పార్టీ భవిష్యత్తు ప్రణాళికపై కీలక వ్యాఖ్యలు చేశారు పీసీసీ మాజీ అధ్యక్షుడు జఖర్.
"ఇది పార్టీ సమావేశం కాదు. పీసీసీ కొత్త అధ్యక్షుడిగా సిద్ధూ నియామకైన సందర్భంగా ఆయనకు స్వాగతం పలుకుతూ.. త్రిపట్ రాజిందర్ సింగ్ బజ్వ తేనీటి విందు ఏర్పాటు చేశారు. పార్టీ ఐక్యంగా ఉంది. మాకు చాలా బాధ్యతలు ఉన్నాయి. 2017 ఎన్నికల్లో ప్రజలు మాకు రెండిట మూడోంతుల మెజారిటీ ఇచ్చారు. ఆ నమ్మకాన్ని మరింత బలపరచాల్సిన బాధ్యత మాపై ఉంది."
- సునీల్ జఖర్, పీసీసీ మాజీ అధ్యక్షుడు.
సిద్ధూకు ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ అభినందనలు తెలపకపోవటంపై అడిగిన ప్రశ్నకు.. ఆయన పదవికన్నా.. మనసు చాలా గొప్పదని, ఎలాంటి సందేహాలు లేవన్నారు సునీల్ జఖర్. ప్రతి ఒక్కరికీ తమ సొంత ఆలోచన ఉంటుందని, ఉదయంలోపు ప్రటన వెలువడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
'ప్రయాణం ఇప్పుడే మొదలైంది.. '
' నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది' అని పేర్కొన్నారు పంజాబ్ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ. పీసీసీ అధ్యక్ష పదవి అప్పగించినందుకు అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయటం, 'పంజాబ్ గెలుపు మిషన్'ను సాధించేందుకు.. కాంగ్రెస్ కుటుంబంలోని ప్రతి ఒక్కరితో కలిసి పనిచేస్తానని చెప్పారు.
" పంజాబ్లోని కాంగ్రెస్ అజేయ కోటను బలోపేతం చేసేందుకు కృషి చేస్తా. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నాపై నమ్మకం ఉంచి, కీలక బాధ్యతలు అప్పగించినందుకు వారికి నా కృతజ్ఞతలు."
- నవజ్యోత్ సింగ్ సిద్ధూ, పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు.
భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూతో తన తండ్రి దిగిన ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశారు సిద్ధూ. తన తండ్రి రాయల్ జీవితాన్ని వదిలి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారని గుర్తు చేసుకున్నారు.
ఇదీ చూడండి:పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా నవజ్యోత్ సింగ్ సిద్ధూ