నీట్ పరీక్షలో 'అక్రమాలు'.. రంగంలోకి సీబీఐ.. 8 మంది అరెస్ట్

author img

By

Published : Jul 18, 2022, 7:25 PM IST

Updated : Jul 18, 2022, 8:20 PM IST

NEET examination 2022

వైద్య విద్యలో ప్రవేశాల కోసం ఆదివారం దేశవ్యాప్తంగా జరిగిన నీట్ పరీక్షలో 'అక్రమాలకు' యత్నించిన 8 మందిని సీబీఐ అరెస్టు చేసింది. వీరిలో ప్రధాన సూత్రధారి కూడా ఉన్నట్లు తెలిసింది. అసలేం జరిగిందంటే?

వైద్య విద్యలో ప్రవేశాల కోసం ఆదివారం దేశవ్యాప్తంగా నీట్​ పరీక్షలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. అభ్యర్థులకు బదులుగా పరీక్ష రాసేందుకు ఇతరులకు సెంటర్​లలోకి అనుమతించేందుకు యత్నించినట్లు సీబీఐకి సమాచారం అందింది. ఈ ఆరోపణలపై 8 మందిని సీబీఐ అరెస్టు చేసింది. వీరిలో ప్రధాన సూత్రధారి కూడా ఉన్నట్లు తెలిసింది.

అసలేం జరిగిందంటే?.. దిల్లీ​, హరియాణాలో ఆదివారం జరిగిన నీట్​ పరీక్షలో నకీలీ అభ్యర్థులను ఎగ్జామ్​ సెంటర్​లోకి అనుమతించడానికి యత్నించినట్లు సీబీఐకు సమాచారం అందింది. భారీ మొత్తంలో డబ్బులు కూడా వసూలు చేశారని సీబీఐకు తెలిసింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు.. ఎనిమిది మందిని అరెస్ట్​ చేశారు. నీట్ పరీక్షలు రాసే విద్యార్థుల పరీక్ష ఐడీ, పాస్‌వర్డ్‌ల వివరాలు సేకరించి ఎవ్వరికీ అనుమానం రాకుండా అభ్యర్థుల ఫొటోలు, వారి స్థానంలో పరీక్షలు రాసే నకిలీ అభ్యర్థుల ఫొటోలను మార్ఫింగ్ చేసి మరీ మోసానికి పాల్పడేందుకు యత్నించారని సీబీఐ ఎఫ్​ఐఆర్​లో ఆరోపించింది.

ఇదీ చదవండి: నీట్ పరీక్షలో విద్యార్థినులకు ఇబ్బందులు.. లోదుస్తులు తీసేస్తేనే ఎంట్రీ!

Last Updated :Jul 18, 2022, 8:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.