ETV Bharat / bharat

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్​కౌంటర్- మావోయిస్టు కమాండర్ హతం

author img

By

Published : Nov 15, 2021, 3:12 PM IST

ఛత్తీస్‌గఢ్‌, నారాయణపుర్​ జిల్లాలో జరిగిన ఎన్​కౌంటర్​లో మావోయిస్టు కమాండర్ మృతిచెందాడు. సోమవారం ఉదయం 11:30 గంటల సమయంలో ఎన్​కౌంటర్ జరిగినట్లు జిల్లా ఎస్పీ గిరిజా శంకర్ జైశ్వాల్​ తెలిపారు. ఏకే-47 తుపాకీ స్వాధీనం చేసుకున్నామన్నారు.

encounter in Chhattisgarh
ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు

ఛత్తీస్​గఢ్​, నారాయణపుర్ జిల్లా బహకేర్​ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మావోయిస్టు 6వ కంపెనీ కమాండర్ సాకేత్​ మృతి చెందాడు. సోమవారం ఉదయం 11:30 గంటల సమయంలో ఎన్​కౌంటర్ జరిగినట్లు నారాయణపుర్ ఎస్పీ గిరిజా శంకర్ జైశ్వాల్​ తెలిపారు.

డిస్ట్రిక్ట్ రిజర్వ్​ గార్డ్​(డీఆర్​జీ) పోలీసుల బృందం అటవీ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తుండగా.. మావోయిస్టులు కాల్పులకు పాల్పడ్డట్టు వివరించారు గిరిజా శంకర్. ఈ కాల్పుల్లో కమాండర్ సాకేత్ మృతిచెందగా.. అతడి దగ్గరి నుంచి ఏకే-47 తుపాకీ స్వాధీనం చేసుకున్నామన్నారు.

వరుస దెబ్బలు

ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర సరిహద్దులోని గడ్చిరోలి జిల్లా గ్యారపట్టి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసుల మధ్య శనివారం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 26 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు గడ్చిరోలీ ఎస్పీ అంకిత్‌ గోయల్‌ వెల్లడించారు. మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు మిలింద్‌ తేల్‌తుంబ్డే ఒకరని ధ్రువీకరించారు. ఎదురు కాల్పుల్లో నలుగురు జవాన్లకు గాయాలైనట్లు తెలిపారు.

ఇవీ చూడండి: మావోయిస్టు ముఖ్యులపై మృత్యుఘాతం

మహారాష్ట్ర ఎన్​కౌంటర్​లో​ 26 మంది నక్సల్స్ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.