ETV Bharat / bharat

బిడ్డ కోసం భార్యాభర్తల కిరాతకం.. యువతిని 16 నెలలు బంధించి.. రేప్​ చేసి..

author img

By

Published : Nov 12, 2021, 3:36 PM IST

madhya pradesh women
బిడ్డ కోసం యువతిపై అత్యాచారం.. 16 నెలలుగా బంధించి..

పిల్లల్ని కనేందుకు ఓ యువతిని బందీ చేసి ఆమెపై అనేక మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఇందుకోసం అతని భార్య కూడా సహకరించడం గమనార్హం. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్ట్​ చేశారు.

మధ్యప్రదేశ్​లోని ఉజ్జయినిలో అమానుష ఘటన జరిగింది. బిడ్డ కోసమని ఓ యువతిని బంధించి 16 నెలలుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. చివరకు శిశువు జన్మించాక బాధితురాలిని ఈనెల 6న దేవాస్​ బస్టాప్​ దగ్గర పడేసి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసుల వివరాల ప్రకారం..

నిందితులు రాజ్​పాల్​ సింగ్​, చంద్రకాంత దంపతులు.. తమకు పుట్టిన ఇద్దరు పిల్లలను కోల్పోయారు. దీంతో సంతానం పొందాలని భావించిన ఆ జంట.. 16 నెలల క్రితం మహారాష్ట్రలోని నాగ్​పుర్​లో ఓ మహిళ వద్ద నుంచి బాధితురాలిని కొనుగోలు చేశారు. అప్పటి నుంచి బాధితురాలిని వీరి ఇంట్లో బందీగా ఉంచి రాజ్​పాల్​ సింగ్​ అనేక సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో గర్భం దాల్చిన యువతి.. గత నెల 25న శిశువుకు జన్మనిచ్చింది. బాధితురాలు ఈనెల 6న ఆపస్మారక స్థితిలో ఉండగా దేవాస్​ బస్​స్టాప్​ వద్ద పడేసి పరారయ్యాడు.

స్పృహలోకి వచ్చిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు దర్యాప్తు చేపట్టారు. ఆమె ఇచ్చిన వివరాల ప్రకారం రాజ్​పాల్​ దంపతులు సహా వారి​ బంధువైన వీరేంద్ర, కృష్ణపాల్, అర్జున్​పై కేసు నమోదు చేశారు.

మానవ అక్రమ రవాణాకు కూడా పాల్పడినట్లు కేసులో పేర్కొన్న పోలీసులు.. బాధితురాలిని విక్రయించిన వారి వివరాలు సేకరించేందుకు యత్నిస్తున్నారు. ప్రధాన నిందితుడు రాజ్​పాల్​ను అరెస్ట్​ చేసిన పోలీసులు.. మిగతా వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.

ఇదీ చూడండి : నిధి కోసం పూజలు.. మహిళను వివస్త్రను చేసి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.