ETV Bharat / bharat

కూలీ డబ్బులు అడిగినందుకు చేయి నరికేసిన యజమాని

author img

By

Published : Nov 21, 2021, 1:32 PM IST

madhya pradesh crime news
కూలీ చేయి నరికివేత

తనకు రావాల్సిన వేతనాన్ని అడిగినందుకు కూలీ చేయి నరికాడు(Madhya Pradesh crime news) ఓ యజమాని. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్​లోని రేవా జిల్లాలో వెలుగు చూసింది. దీనికి సంబంధించి ముగ్గురిని అరెస్ట్​ చేశారు పోలీసులు.

మధ్యప్రదేశ్​ రేవా జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. తనకు రావాల్సిన వేతనాన్ని అడిగినందుకు కూలీ చేయి నరికాడు(Madhya Pradesh crime news) ఓ యజమాని. సిర్​మౌర్​ పోలీసు స్టేషన్​ పరిధిలోని డోల్​మవూ గ్రామంలో జరిగిందీ ఘటన.

ఇదీ జరిగింది

రేవా జిల్లాలో దళిత వర్గానికి చెందిన అశోక్​ సాకేత్​ కొన్ని రోజుల క్రితం డోల్​మవూ గ్రామానికి చెందిన గణేశ్​ మిశ్రా వద్ద కూలీగా పని చేశాడు. అయితే సాకేత్​కు రావాల్సిన వేతనాన్ని మిశ్రా చెల్లించలేదు. దీంతో బకాయి పడిన​ వేతనం ఇవ్వాలని సాకేత్​ డిమాండ్​ చేశాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన గణేశ్​.. పదునైన ఆయుధంతో సాకేత్​ చేయి(Rewa crime news) నరికేశాడు. అనంతరం ఘటనాస్థలికి సమీపంలో ఆ చేయిని దాచేశాడు. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. నరికేసిన చేయిని వెతికి పట్టుకుని, సాకేత్​ను సంజయ్​ గాంధీ మెమోరియల్ ఆస్పత్రికి తరలించారు. శస్త్రచికిత్స చేసి అతికించారు వైద్యులు. అయితే ఎక్కువ రక్తం పోవడం వల్ల బాధితుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.

ఈ ఘటనపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. గణేశ్​ మిశ్రా, అతని సోదరులు రత్నేశ్​ మిశ్రా, కృష్ణ కుమార్​ మిశ్రాలను అరెస్ట్​ చేశారు. పెండింగ్‌లో ఉన్న వేతనాలు చెల్లించకుండా అడ్డగోలుగా వ్యవహరిస్తున్నట్లు గణేశ్​ మిశ్రాపై ఆరోపణలు ఉన్నట్లు తెలిపారు.

ఇవీ చూడండి:

మూడేళ్లుగా ఫేస్​బుక్ ప్రేమ.. తనను కాదన్నాడని యాసిడ్ దాడి

సహోద్యోగులపై వైద్యులు అత్యాచారం.. చివరకు..

నాటుబాంబు పేలి- చూపు కోల్పోయిన బాలుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.