బైక్​ను ఢీకొట్టిన ట్రక్కు.. బిడ్డకు జన్మనిచ్చి ప్రాణాలొదిలిన మహిళ

author img

By

Published : Jul 21, 2022, 9:42 AM IST

up road accident
రోడ్డు ప్రమాదంలో గర్భిణీ మృతి ()

రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలైన ఓ గర్భిణీ.. పాపకు జన్మనిచ్చి మరణించింది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. దీంతో మృతురాలి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఉత్తర్​ప్రదేశ్​.. ఫిరోజాబాద్​లో దారుణం జరిగింది. భర్తతో కలిసి బైక్​పై గర్భిణీ వెళ్తుండగా ట్రక్కు​ వీరి వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలపాలైన ఆ మహిళ రోడ్డుపైనే ఆడపిల్లకు జన్మనిచ్చి మరణించింది. దీంతో ఆమె భర్త కన్నీరుమున్నీరుగా విలపించాడు. మృతురాలి గ్రామంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.

firozabad road accident
రోడ్డు ప్రమాదంలో మరణించిన కామిని

అసలేం జరిగిందంటే: ఆగ్రాకు చెందిన రాము అనే వ్యక్తి తన భార్య కామినిని తీసుకుని బైక్​పై బుధవారం అత్తవారింటికి బయలుదేరాడు. కామిని గర్భిణీ. నారఖీ పోలీస్ స్టేషన్​ పరిధిలోని బరతరా గ్రామ సమీపంలో వీరి బైక్​ను ట్రక్కు ఢీకొట్టింది. దీంతో కామినికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ సమయంలో ఆమె రోడ్డుపైనే ఆడబిడ్డకు జన్మనిచ్చి మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. పసిపాప క్షేమంగా ఉందని పోలీసులు తెలిపారు.

firozabad road accident
విలపిస్తున్న మృతురాలి భర్త రాము

ఇవీ చదవండి: యోగి కేబినెట్‌లో కలకలం.. మంత్రి రాజీనామా.. మరొకరు దిల్లీకి..

చాక్లెట్​ తిని ఆరేళ్ల బాలిక మృతి.. ఏం జరిగిందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.