ETV Bharat / bharat

అమ్మ, నానమ్మ కర్కశం.. బాలిక నోట్లో మట్టి నింపి.. శ్మశానంలో పాతిపెట్టి..

author img

By

Published : Jul 12, 2022, 9:03 AM IST

Updated : Jul 12, 2022, 11:38 AM IST

Mother And Grandmother Buried 3 Years Girl
మూడేళ్ల బాలికను భూమిలో పాతిపెట్టిన కిరాతకులు

బిహార్​లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మూడేళ్ల బాలికను.. ఆమె తల్లి, నాయనమ్మ కలిసి శ్మశానంలో పాతిపెట్టారు. బాలిక ఏడుపు విన్న స్థానికులు ఆమెను రక్షించి.. పోలీసులకు సమాచారం అందించారు.

బిహార్​.. సారన్​లో అమానవీయ ఘటన జరిగింది. మూడేళ్ల బాలికను ఆమె తల్లి, నానమ్మ కలిసి స్మశానంలో పాతిపెట్టారు. బాలిక ఏడుపు విన్న స్థానికులు వచ్చి ఆమెను కాపాడారు. ఈ దారుణం కోపా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

Mother And Grandmother Buried 3 Years Girl
బాధితురాలు లాలీ
అసలేమైందంటే.. మర్హా నది ఒడ్డున ఉన్న స్మశానవాటికలో మూడేళ్ల బాలికను ఆమె తల్లి, నానమ్మ పాతిపెట్టేశారు. బాధితురాలి ఏడుపులు విన్న మహిళలు దెయ్యం అని భయపడ్డారు. అనంతరం స్థానికులు అక్కడ గుమిగూడారు. మట్టిని తొలగించి చూడగా.. బాలిక బతికే ఉంది. వెంటనే కోపా పోలీస్​ స్టేషన్​కు సమాచారం అందించారు. పోలీసులు బాధితురాలికి ప్రథమ చికిత్స అనంతరం ఆసుపత్రికి తరలించారు.

పోలీసులకు బాధితురాలు తన పేరు లాలీ అని చెప్పింది. తన తండ్రి పేరు రాజు శర్మ, తల్లి పేరు రేఖా దేవీ అని వెల్లడించింది. ఊరు పేరు చెప్పలేకపోయింది. బాలిక కుటుంబ సభ్యుల కోసం గాలిస్తున్నామని కోపా పోలీసులు తెలిపారు. 'అమ్మ, నానమ్మ బయటకు వెళ్దాం అని తీసుకెళ్లారు. అనంతరం నన్ను స్మశానం వద్దకు తీసుకెళ్లి నోటిలో మట్టిని నింపి పాతిపెట్టారు' అని బాధితురాలు లాలీ తెలిపింది.

ఇవీ చదవండి:

విద్యాశాఖ మంత్రి ఉదారత.. చికిత్స కోసం చేతి బంగారు గాజులు

కాంగ్రెస్​ నేత దారుణ హత్య.. పట్టపగలే పదునైన ఆయుధాలతో..

Last Updated :Jul 12, 2022, 11:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.