నవంబర్​ నెలాఖరున పార్లమెంట్​ శీతాకాల సమావేశాలు!

author img

By

Published : Oct 22, 2021, 4:25 PM IST

Updated : Oct 22, 2021, 5:01 PM IST

parliament sessions
పార్లమెంట్​ శీతాకాల సమావేశాలు ()

నవంబరు నాలుగోవారం నుంచి నెల రోజుల పాటు పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్నట్లు సమాచారం. ఈ సెషన్​ నవంబరు 29న ప్రారంభమై డిసెంబరు 23 నాటికి ముగుస్తుందని తెలుస్తోంది.

వచ్చేనెల చివరి వారంలో పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి! కరోనా నిబంధనలకు అనుగుణంగా నెల రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ సెషన్​లో దాదాపు 20 సార్లు సమావేశాలు జరిగే అవకాశం ఉండగా.. క్రిస్మస్​​కు ముందే ముగుస్తాయని పేర్కొన్నాయి.

ఈ సెషన్​ నవంబరు 29న ప్రారంభమై డిసెంబరు 23 నాటికి ముగుస్తుందని ఆ వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కరోనా కారణంగా గతేడాది పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగలేదు. బడ్జెట్​ సహా వర్షాకాల సమావేశాలను కుదించి.. నిర్వహించారు.

ఈ సమావేశాల్లో లోక్​సభ, రాజ్యసభలు ఏకకాలంలో సమావేశంగా కానుండగా.. భౌతిక దూరం నిబంధనలు పాటిస్తూ.. సభ్యులు హాజరుకానున్నారు. తొలుత కొన్ని రోజులు రెండు సభలు వేర్వేరుగా భేటీ కానున్నాయి. సభల్లో పాల్గొన్నవారికి కొవిడ్​ టెస్టులు నిర్వహించడం సహా మాస్క్​ తప్పనిసరి చేయనున్నారు.

వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సెషన్​కు ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ అసెంబ్లీ ఎన్నికలను 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్​గా భావిస్తున్న తరుణంలో ఈ సమావేశాలు రాజకీయంగా కీలకంగా మారనున్నాయి.

ఇదీ చూడండి: 'ఆపరేషన్‌ సర్ప్‌వినాశ్‌'ను తలపించేలా పూంచ్‌ ఎన్‌కౌంటర్‌!

Last Updated :Oct 22, 2021, 5:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.