ETV Bharat / bharat

మోదీ అధ్యక్షతన సముద్ర భద్రతపై ఐరాసలో చర్చ!

author img

By

Published : Aug 9, 2021, 6:27 AM IST

ఐక్యరాజ్యసమితి భద్రత మండలి (యూఎన్‌ఎస్‌సీ)లో సముద్ర భద్రతపై సోమవారం చర్చ జరగనుంది. ఈ చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించనున్నారు. యూఎన్‌ఎస్‌సీలో ఓ బహిరంగ చర్చకు అధ్యక్షత వహిస్తున్న తొలి భారత ప్రధాని మోదీయే కానున్నారు.

PM Modi
ప్రధాని నరేంద్ర మోదీ

ఐక్యరాజ్యసమితి భద్రత మండలి (యూఎన్‌ఎస్‌సీ)లో సోమవారం సముద్ర భద్రతపై జరిగే చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించనున్నారు. ప్రస్తుతం భద్రత మండలి అధ్యక్ష స్థానంలో భారత్‌ ఉండటం వల్ల ఆయనకు ఈ అవకాశం వచ్చింది. ఆ విధంగా యూఎన్‌ఎస్‌సీలో ఓ బహిరంగ చర్చకు అధ్యక్షత వహిస్తున్న తొలి భారత ప్రధాని మోదీయే కానున్నారు.

భద్రత మండలి సభ్య దేశాల నేతలు, ఐరాస అనుబంధ సంస్థలతో పాటు ఇతర అంతర్జాతీయ సంస్థల అధిపతులు ఈ చర్చలో పాల్గొనే అవకాశం ఉందని ప్రధాని కార్యాలయం తెలిపింది. సముద్ర నేరాలు, అభద్రతను సమర్థంగా ఎదుర్కోవడం, తీర ప్రాంతాల్లోని దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై ప్రధానంగా చర్చ జరుగుతుందని పేర్కొంది.

ఇదీ చూడండి: పెగసస్​పై మోదీని ప్రశ్నిస్తూ విపక్షాల 3 నిమిషాల వీడియో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.