ETV Bharat / bharat

'రాహుల్​ గాంధీ కేసు నేను విచారించను'.. తప్పుకున్న గుజరాత్​ హైకోర్టు జడ్జి

author img

By

Published : Apr 26, 2023, 7:01 PM IST

పరువు నష్టం కేసులో సూరత్ సెషన్స్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాహుల్ దాఖలు చేసిన పిటిషన్​ విచారణ నుంచి గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి తప్పుకున్నారు. అంతకుముందు ఈ వ్యాజ్యంపై అత్యవసర విచారణకు అనుమతి ఇచ్చింది న్యాయస్థానం.

modi surname defamation case
modi surname defamation case

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ గుజరాత్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్​పై విచారణ నుంచి న్యాయమూర్తి తప్పుకున్నారు. నేరపూరిత పరువునష్టం కేసులో సూరత్ సెషన్స్​ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాహుల్​.. మంగళవారం గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసును అత్యవసరంగా విచారణ చేపట్టాలని రాహుల్​ గాంధీ తరఫు న్యాయవాది పీఎస్​ చంపానేరి బుధవారం హైకోర్టును కోరారు. ఇందుకు గుజరాత్​ హైకోర్టు అంగీకరించింది. దీంతో ఈ పిటిషన్​ను పరిశీలించిన జస్టిస్​ గీతా గోపీ.. తాను ఈ కేసును విచారించబోనని స్పష్టం చేశారు. అయితే, ఈ పిటిషన్​పై బుధవారం అత్యవసర విచారణకు కోరవచ్చని హైకోర్టు తనకు అనుమతి ఇచ్చిందని.. కానీ విచారణకు కోరగా న్యాయమూర్తి తప్పుకున్నట్లు చెప్పారని చంపానేరి వెల్లడించారు. క్రిమినల్​ రివ్యూ పిటిషన్లపై జస్టిస్​ గీతా బెంచ్​ విచారిస్తున్నందునే.. ఆమె వద్దకు వెళ్లామని ఆయన వివరించారు.

మరోవైపు మంగళవారమే సూరత్ సెషన్స్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు రాహుల్ గాంధీ. అంతకుముందు ఈ కేసుపై విచారణ జరిపిన సూరత్‌ కోర్టు.. రాహుల్‌ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే ఈ తీర్పును పై కోర్టులో సవాల్‌ చేసేందుకు వీలుగా 30 రోజుల గడువు ఇచ్చింది. అప్పటి వరకు బెయిల్‌ కూడా మంజూరు చేసింది. ఈ కేసులో తనపై విధించిన శిక్షపై స్టే విధించాలని కోరుతూ రాహుల్ గాంధీ వేసిన పిటిషన్‌ను సూరత్​ సెషన్స్​ కోర్టు ఏప్రిల్ 20న తిరస్కరించింది.

ఇదీ కేసు..
2019లో కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన రాహుల్​ గాంధీ.. మోదీ ఇంటిపేరుపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను తప్పుపడుతూ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ గుజరాత్‌లోని సూరత్‌లో పరువునష్టం దావా దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సూరత్‌ కోర్టు.. రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పు వెలువడిన 24 గంటల్లోపే ప్రజా ప్రాతినిధ్య చట్టం నిబంధనల మేరకు లోక్‌సభ సచివాలయం ఆయనపై అనర్హత వేటు వేసింది. దీంతో ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోయారు. అంతే కాకుండా ఈ వేటు కారణంగా ప్రజాప్రతినిధులకు కేటాయించే అధికారిక భవనాన్ని కూడా ఖాళీ చేయాలని రాహుల్​కు నోటీసులు పంపించారు అధికారులు. దీంతో ఇటీవలే ఆయన తన ఇంటిని ఖాళీ తల్లి సోనియా గాంధీ నివాసానికి మారారు.

ఇవీ చదవండి : గన్​తో క్లాస్​లో హల్​చల్​.. 80 మంది విద్యార్థులు హడల్.. చివరకు..

సీఎం, ప్రతిపక్ష నేత ఆత్మీయ కలయిక.. ఎయిర్​పోర్ట్​లో భుజాలు తట్టుకుంటూ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.