ETV Bharat / bharat

భాజపా ఎంపీ ఇంటిపై బాంబు దాడి- గవర్నర్ ఆందోళన

author img

By

Published : Sep 8, 2021, 9:58 AM IST

miscreants-hurl-bombs-at-bjp-mp-arjun-singhs-house-at-bhatpara west bengal
భాజపా ఎంపీ ఇంటిపై బాంబుల దాడి- గవర్నర్ ఆందోళన

బంగాల్​లో భాజపా ఎంపీ ఇంటి ఆవరణలో (West Bengal MP bomb) బాంబు దాడి జరిగింది. ఈ విషయంపై ఆ రాష్ట్ర గవర్నర్ జగ్​దీప్ ధన్​కడ్ (Bengal governor) ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనపై పోలీసులు వేగంగా చర్యలు తీసుకోవాలన్నారు.

బంగాల్​లో భాజపా ఎంపీ ఇంటి బయట బాంబు దాడి (West Bengal MP bomb) జరిగింది. బరాక్​పుర్ నియోజకవర్గ ఎంపీ అర్జున్ సింగ్ నివాసంపై గుర్తు తెలియని దుండగులు బాంబులు విసిరారు. ఇంటి వద్ద డ్యూటీలో ఉన్న సీఆర్​పీఎఫ్ జవాను తృటిలో గాయాల నుంచి తప్పించుకున్నాడు. అయితే, ఈ సమయంలో ఇంట్లో అర్జున్ సింగ్ లేరు. ఆయన ప్రస్తుతం దిల్లీలో ఉన్నారు.

bomb blast at mp house
బాంబు దాడి జరిగిన గేటు..

తెల్లవారుజామున మూడు భారీ శబ్దాలు వినిపించాయని స్థానికులు చెప్పారు. వరుసగా మూడు బాంబులు (bombs hurled at MP) విసిరినట్లు తెలుస్తోంది. దీంతో ఆ ప్రాంతం అంతా పొగ అలుముకుంది.

bomb blast at mp house
ఎంపీ ఇంటి వద్ద భద్రత

గవర్నర్ ఆందోళన

ఈ ఘటనపై బంగాల్ గవర్నర్ జగ్​దీప్ ధన్​కడ్ (Bengal governor) ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఆందోళనకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. పోలీసులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అర్జున్ సింగ్ భద్రత అంశాన్ని తాను ఇదివరకే లేవెనత్తినట్లు ధన్​కడ్ తెలిపారు. సమస్య గురించి ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో చర్చించినట్లు చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.