ETV Bharat / bharat

సీబీఐ డైరెక్టర్​ నియామకంపై మే 2 తర్వాతే భేటీ

author img

By

Published : Apr 20, 2021, 7:46 AM IST

Meeting of committee for appointment of CBI director
సీబీఐ డైరెక్టర్​ నియామకంపై భేటీ

సీబీఐ డైరెక్టర్​ నియామకంపై మే 2 తర్వాతే ఉన్నతస్థాయి కమిటీ భేటీ అవుతుందని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. కమిటీలో సభ్యుడయ్యే అధీర్ రంజన్ చౌధరీ అంతవరకు వరకు అందుబాటులో ఉండకపోవడమే ఇందుకు కారణమని పేర్కొంది.

కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కు పూర్తిస్థాయి డైరెక్టర్​ను నియమించడంపై ఉన్నతస్థాయి కమిటీ మే 2వ తేదీ తర్వాత సమావేశమవుతుందని సుప్రీంకోర్టుకు తెలియజేసింది కేంద్రం.

"కమిటీలో సభ్యుడయ్యే కాంగ్రెస్​ సీనియర్​ నేత అధీర్​ రంజన్​ చౌధరీతో ఈ విషయంపై చర్చించాం. ఆయన మే 2వ తేదీ వరకు అందుబాటులో ఉండనని చెప్పారు" అని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్​లో కేంద్రం తెలిపింది.

ఈ ఉన్నత స్థాయి కమిటీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ఉన్నారు.

ఇదీ చూడండి: కరోనా బాధితుల కోసం కొత్త ఆక్సిజన్​ వ్యవస్థ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.