ETV Bharat / bharat

దగ్గు టానిక్​కు బదులు 'పేల మందు'- ప్రాణాపాయంలో మహిళ!

author img

By

Published : Apr 21, 2022, 4:03 PM IST

ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. దగ్గు వస్తుందని వెళ్లిన ఆమెకు కాఫ్​ సిరప్​కు బదులు పేల మందు సీసా ఇచ్చారు. ఆ విషయం తెలియక టానిక్​ తాగిన ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. ఈ ఘటన మధ్యప్రదేశ్​ షాడోల్ జిల్లాలో జరిగింది.

medical negligence in india
కాఫ్​ సిరప్​కు బదులు 'పేల మందు'- ప్రాణాపాయంలో మహిళ!

Medical negligence in India: దగ్గు మందు అనుకుని పేల మందు తాగిన ఓ వృద్ధురాలు తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఈ ఘటన మధ్యప్రదేశ్​ షాడోల్​ జిల్లాలోని ధన్​పురి ప్రాంతంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. 65 ఏళ్ల రాజ్​కుమారి జైస్వాల్​ కొద్దిరోజులుగా దగ్గుతో బాధపడుతోంది. చికిత్స కోసం బుర్హార్​ సామాజిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లింది. అక్కడి వైద్యులు ఆమె పరిస్థితిని పరిశీలించి, మందుల చీటీ రాసిచ్చారు. ప్రిస్క్రిప్షన్​లోని ఔషధాల్ని ఆరోగ్య కేంద్రం నుంచే తీసుకుని, ఇంటికి వెళ్లింది రాజ్​కుమారి.

దగ్గు తగ్గి, ఉపశమం లభిస్తుందన్న ఆశతో ఆస్పత్రిలో ఇచ్చిన సిరప్​ను తాగింది రాజ్​కుమారి. వెంటనే ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. కుటుంబసభ్యులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆమె ఏం ఔషధం వేసుకుందా అని అప్పుడు చూశారు. అది దగ్గు మందు కాదు పేల మందు అని తెలుసుకుని కంగుతిన్నారు.

ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులకు రాజ్​కుమారి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. అయితే.. ఆరోగ్య కేంద్రం సిబ్బంది స్పందన మరోలా ఉంది. "మేము దగ్గు మందే రాసి ఇచ్చాం. అయితే ఆమె హడావుడిలో మరో రోగి కోసం రాసిన ప్రిస్క్రిప్షన్​ తీసుకుని వెళ్లిపోయింది" అని చెప్పారు బుర్హార్ మండల వైద్యాధికారి సచిన్ కర్ఖుర్.

వెన్ను నొప్పికి పశువుల ఇంజెక్షన్​: మరోవైపు.. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఓ నకిలీ వైద్యుడు పశువుల ఇంజెక్షన్లు ఇస్తున్న ఘటనలు ఒడిశాలోని మయూర్​భంజ్​ జిల్లాలో కలకలం సృష్టిస్తున్నాయి. మహులదిహా గ్రామానికి చెందిన శ్రీకంఠం అనే వ్యక్తి వెన్నునొప్పితో బాధపడుతుండగా కొద్దిరోజుల క్రితం పశువుల ఇంజెక్షన్​ ఇచ్చాడు బిశ్వనాథ్​ బెహరా అనే నకిలీ వైద్యుడు. ఇప్పుడు అదే వైద్యుడు మరో వ్యక్తికి సైతం పశువుల ఇంజెక్షన్​ ఇచ్చినట్లు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం నిందితుడు బిశ్వనాథ్​ బెహరా కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రోగి పొట్టలో కాటన్ వదిలేసి..: ఉత్తర్​ప్రదేశ్​లో ఓ వైద్యురాలి నిర్లక్ష్యంపై ఆ రాష్ట్ర వివాద పరిష్కారాల కమిషన్ కొరడా ఝుళిపించింది. ఓ మహిళకు ఆపరేషన్ చేస్తూ.. పొట్టలో కాటన్​ను వదిలిపెట్టిన ఘటనపై సీరియస్ అయింది. బాధితురాలికి రూ.45.39 లక్షలు చెల్లించాలని ఆస్పత్రి వైద్యురాలిని ఆదేశించింది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.