ETV Bharat / bharat

ఫోన్​ ట్యాపింగ్​పై ఉపరాష్ట్రపతి అభ్యర్థి సంచలన ఆరోపణలు

author img

By

Published : Jul 26, 2022, 1:13 PM IST

Margaret alva MTNL: కేంద్రంపై సంచలన ఆరోపణలు చేశారు విపక్షాల ఉపరాష్ట్ర అభ్యర్థి మార్గరెట్​ ఆళ్వా. కేంద్రం ఫోన్​ ట్యాపింగ్​కు పాల్పడుతోందని.. రాజకీయ నేతలు ఫోన్లో ఏం మాట్లాడుకుంటున్నారో అన్నీ కేంద్రానికి తెలుసని అన్నారు. ఈ ఆరోపణలను తోసిపుచ్చారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్​ జోషి. ఆళ్వా చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు.

ఆళ్వా
ఆళ్వా

Margaret alva MTNL: విపక్షాల ఉపరాష్ట్ర అభ్యర్థి మార్గరెట్​ ఆళ్వా కేంద్రంపై సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రం ఫోన్​ ట్యాపింగ్​కు పాల్పడుతోందని.. భాజపాలోని తన స్నేహితులతో ఫోన్​లో మాట్లాడాక తన కాల్స్​ అన్నీ డైవర్ట్​ అవుతున్నాయన్నారు. ఈ మేరకు ట్వీట్లు చేశారు ఆళ్వ.

"ఈ కొత్త ఇండియాలో రాజకీయ నాయకులు ఇతర పార్టీ నేతలతో మాట్లాడాలంటే భయపడుతున్నారు. 'బిగ్​బ్రదర్​'కు అన్నీ తెలుస్తాయన్న భయం వారిలో కలుగుతోంది. అందుకే రెండు, మూడు ఫోన్లు వాడుతూ ఎప్పటికప్పుడు సిమ్​ కార్డులు మార్చుతున్నారు. అంతేకాదు కలిసినప్పుడు కూడా గుసగుసలాడుకుంటూనే మాట్లాడుకుంటారు. భయం ప్రజాస్వామ్యాన్ని చంపేస్తుంది."

-మార్గరెట్​ ఆళ్వా, ఉపరాష్ట్రపతి అభ్యర్థి

ఈ సందర్భంగా ఎంటీఎన్​ఎల్​ సంస్థ నోటీసు పంపిన ఫొటోను షేర్​ చేశారు ఆళ్వ. కేవైసీ సస్పెండ్​ చేస్తున్నామని, మరో 24 గంటల్లో సిమ్​ కార్డును బ్లాక్​ చేస్తామని నోటీసులో ఉంది. అయితే ఇవి నకిలీ నోటీసులు అంటూ అంతకుముందే దిల్లీ పోలీసులు హెచ్చరించడం గమనార్హం. ఎంటీఎన్​ఎల్​ పేరు, లోగోను దుర్వినియోగం చేసి వాట్సాప్​లో ఈ తరహా ఫ్రాడ్​ మెసేజులు వస్తుంటాయని తెలిపారు. ఇది కేవైసీ స్కామ్​లో ఒక రకమని తెలిపారు.

కేంద్రం క్లారిటీ: ఆళ్వా ఆరోపణలను కేంద్ర మంత్రి ప్రహ్లాద్​ జోషి తోసిపుచ్చారు. ఆమె ఫోన్ ట్యాప్​ చేయాల్సిన అవసరం తమకు ఏముందని ప్రశ్నించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థి గెలుస్తారన్న నమ్మకం ఉందన్నారు. ఆళ్వా చేసే ఆరోపణల్లో అర్థం లేదని.. ఓ సీనియర్​ నేత అయ్యి ఉండి ఇలాంటి అసత్య ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు జోషి.

ఇదీ చూడండి : కల్తీ మద్యం తాగి 22 మంది మృతి.. పలువురి పరిస్థితి విషమం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.