మద్యం పేరిట రసాయనాల విక్రయం.. 36కు చేరిన మృతులు

author img

By

Published : Jul 26, 2022, 9:29 AM IST

Updated : Jul 26, 2022, 10:13 PM IST

కల్తీ మద్యం

09:21 July 26

మద్యం పేరిట రసాయనాల విక్రయం.. 36కు చేరిన మృతులు

గుజరాత్‌లోని బోటాడ్ జిల్లాలో కల్తీ మద్యం తాగి మరణించిన వారి సంఖ్య 36కు చేరింది. భావ్​నగర్​, బోటాడ్​, బర్వాలాలోని ఆసుపత్రుల్లో అనేక మంది చికిత్స పొందుతున్నారని అధికారులు వెల్లడించారు. బోటాడ్ జిల్లాతో పాటు, అహ్మదాబాద్​లోని ధంధూకా ప్రాంతంలో అనేక మంది ప్రజలు కల్తీ మద్యానికి బాధితులుగా మారారని అధికారులు తెలిపారు. కల్తీ మద్యం తయారుచేస్తున్న బోటాడ్ జిల్లాకు చెందిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తాజాగా, పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మద్యం పేరుతో ప్రమాదకర రసాయనాలను విక్రయించినట్లు తేలింది. మిథైల్ ఆల్కహాల్​ అనే రసాయనాన్ని నీటిలో కలిపి.. మద్యం పేరిట విక్రయాలు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. రూ.20కే సీసా చొప్పున వీటిని అమ్మినట్లు చెప్పారు. బాధితుల్లో చాలా మంది మిథనాల్ కలిపిన రసాయనాన్నే సేవించినట్లు తెలిపారు. మద్యంలో 99 శాతం రసాయనాలే ఉన్నాయని చెప్పారు.

ఏమైందంటే..?
సోమవారం బోటాడ్ జిల్లాలోని రోజిద్ గ్రామంలోని పలువురు, ధందుక, భావ్​నగర్ ప్రాంతాల్లో కొందరు కల్తీ మద్యం తాగి అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం.. విచారణకు సిట్​ను ఏర్పాటు చేసింది. గుజరాత్ టెర్రరిజం స్క్వాడ్, అహ్మదాబాద్​ క్రైం బ్రాంచ్ కూడా ఈ దర్యాప్తులో భాగమయ్యాయి.

మరోవైపు దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భావ్​నగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను మంగళవారం పరామర్శించనున్నారు. 'కల్తీ మద్యం వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం. భావ్​నగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని మంగళవారం పరామర్శిస్తాను' అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

ఇవీ చదవండి: పోలీస్​స్టేషన్​లో అక్కాచెల్లెళ్ల వీరంగం.. మహిళా ఇన్​స్పెక్టర్​ను చెప్పుతో కొట్టి..

ఆమెకు 53.. అతడికి 29.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి..

Last Updated :Jul 26, 2022, 10:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.