ETV Bharat / bharat

హీరో​ కుటుంబంలో విషాదం- యాక్సిడెంట్​లో ఒకేసారి ఆరుగురు మృతి

author img

By

Published : Nov 16, 2021, 10:17 AM IST

Updated : Nov 16, 2021, 7:51 PM IST

బిహార్ లఖీసరాయ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్యాస్​ సిలిండర్ల లోడ్​తో వెళ్తున్న ట్రక్కు ఢీకొని టాటా విక్టా వాహనంలో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా దివంగత బాలీవుడ్​ నటుడు సుశాంత్​ సింగ్ రాజ్​పుత్​ బంధువులు కావడం గమనార్హం.

many people died in road accident in lakhisarai
రోడ్డు ప్రమాదంలో నటుడు 'సుశాంత్ సింగ్​'​ బంధువులు మృతి

గ్యాస్​ సిలిండర్ల ట్రక్కును కారు ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి (Sushant Singh Rajput Family Accident) చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో నలుగురిని అధికారులు ఆసుపత్రికి తరలించారు. బిహార్​లోని లఖీసరాయ్​లో ఈ విషాద ఘటన జరిగింది. మృతులను.. దివంగత బాలీవుడ్​ నటుడు (Sushant Singh Rajput Family Accident) సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​, బిహార్​ మంత్రి నీరజ్​ సింగ్​ బబ్లూ బంధువులుగా అధికారులు గుర్తించారు.

యాక్సిడెంట్​లో ఒకేసారి ఆరుగురు మృతి

భార్య అంత్యక్రియల నుంచి తిరిగి వస్తుండగా..

సుశాంత్​ సింగ్​ బంధువు, హరియాణా ఏడీజీ ఓంప్రకాశ్​ సింగ్​ (Sushant Singh Rajput Family Accident) సోదరి గీతా సింగ్​ సోమవారం పట్నాలో అనారోగ్యంతో మృతిచెందారు. భర్త లాల్​జీత్​ సింగ్​ సహా మరో తొమ్మిది మంది బంధువులు ఆమె దహనసంస్కారాల అనంతరం పట్నా నుంచి టాటా విక్టాలో తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. టాటా విక్టా డ్రైవర్​ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని స్థానికులు అంటున్నారు. ట్రక్కును వేగంగా ఢీకొనడం వల్ల ఈ వాహనం అమాంతం గాల్లో ఎగిరిపిడినట్లు చెప్పారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: దేశంలో 287 రోజుల కనిష్ఠానికి కరోనా కొత్త కేసులు

Last Updated :Nov 16, 2021, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.