ETV Bharat / bharat

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ట్విస్ట్.. అప్రూవర్​గా మారిన సిసోదియా అనుచరుడు

author img

By

Published : Nov 7, 2022, 7:23 PM IST

Updated : Nov 7, 2022, 7:34 PM IST

Delhi excise policy case
దిల్లీ మద్యం పాలసీ

Delhi Excise Policy Case : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆసక్తికర పరిణామాలు జరిగాయి. దిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా ప్రధాన అనుచరుడు దినేశ్ అరోరా అప్రూవర్​​గా మారారు. అయితే ఆయన్ను అప్రూవర్​గా అంగీకరించడంపై ఈ నెల 14న నిర్ణయం తీసుకుంటామని కోర్టు తెలిపింది.

Delhi Excise Policy Case : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా ప్రధాన అనుచరుడు దినేశ్‌ అరోరా అప్రూవర్‌గా మారారు. ఈ మేరకు సీబీఐ కోర్టుకు ఆయన నివేదించారు. ఈ కేసులో అప్రూవర్‌గా మారి.. వాస్తవాలు బయటపెడతానని విచారణ సందర్బంగా న్యాయమూర్తికి వివరించారు. ఈ విషయంలో ఏదైనా ఒత్తిడి ఉందా అని జడ్జి ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని బదులిచ్చారు. సీబీఐ నుంచిగానీ, ఇతరుల నుంచి గానీ తనపై ఎలాంటి ఒత్తిడి లేదని దినేశ్ అరోరా స్పష్టం చేశారు.

సున్నితమైన ఈ కేసు విచారణకు మీడియాను దూరంగా ఉంచాలని అరోరా తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అందుకు సీబీఐ కూడా అంగీకరించింది. అయితే దినేశ్‌ అరోరాను అప్రూవర్‌గా అంగీకరించడంపై ఈనెల 14న తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని జడ్జి ఎంకే నాగ్​పాల్​ ప్రకటించారు. ఈ కేసు నుంచి తనకు విముక్తి కల్పించాలన్న అరోరా పిటిషన్‌పైనా అదేరోజు వాదనలు ఆలకిస్తామని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి: ఆ లెటర్​ వల్ల యువ మేయర్ 'ఆర్య'కు చిక్కులు.. రాజీనామాకు శశిథరూర్ డిమాండ్

హిందుత్వ నేతలకు బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు ఇచ్చిన పోలీసులు

Last Updated :Nov 7, 2022, 7:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.