ETV Bharat / bharat

స్కూల్ విద్యార్థుల బస్సులకు ఘోర ప్రమాదం.. 15 మంది మృతి!

author img

By

Published : Dec 21, 2022, 3:53 PM IST

Updated : Dec 21, 2022, 4:46 PM IST

విజ్ఞాన యాత్రకు వెళ్లిన విద్యార్థుల బస్సులకు ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 15 మంది చనిపోయినట్లు సమచారం. మణిపుర్​లో జరిగిందీ ఘటన.

Manipur Bus Accident
Manipur Bus Accident

Manipur Bus Accident : మణిపుర్‌లోని నోనీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజ్ఞానయాత్రకు వెళ్లిన విద్యార్థుల రెండు బస్సులు.. ప్రమాదానికి గురయ్యాయి. బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో 15 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. అయితే మరణాలపై అధికారిక సమాచారం లేదు. మరోవైపు ఘటనలో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

పోలీసుల సమాచారం ప్రకారం.. జిల్లాలోని యారిపోక్​లో ఉన్న తంబలను ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు విజ్ఞాన యాత్ర కోసం రెండు బస్సుల్లో ఖౌపుమ్​కు బయలుదేరారు. లోంగ్​సాయి టుబుంగ్​ గ్రామ సమీపంలో బిష్ణుపర్​-ఖౌపుమ్​ రహదారిపై రెండు బస్సులకు ప్రమాదం జరిగింది. ఘటనలో గాయపడిన విద్యార్థులను తొలుత బిష్ణుపుర్​ జిల్లాకు ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం ఇంఫాల్​లోని మెడిసిటీ హాస్పిటల్​లో చేర్పించారు.

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం
ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌. బీరేన్‌ సింగ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను ట్విట్టర్‌లో షేర్‌ చేసిన ఆయన.. ఘటనాస్థలిలో సహాయకచర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

Last Updated :Dec 21, 2022, 4:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.