ETV Bharat / bharat

భారీ ఆధిక్యంలో మమత- విజయం నల్లేరుపై నడకే!

author img

By

Published : Oct 3, 2021, 11:51 AM IST

Updated : Oct 3, 2021, 12:28 PM IST

భవానీపుర్ ఉపఎన్నిక(Bhabanipur by-election) కౌంటింగ్​లో భారీ ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee ). ఆరు రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యేసరికి దీదీ.. 23,957 ఓట్ల ముందంజలో ఉన్నారు.

mamata leading in bhabanipur
భారీ ఆధిక్యంలో మమత

భవానీపుర్ ఉప ఎన్నికల్లో (Bhabanipur by-election) టీఎంసీ అధినేత్రి, ఆ పార్టీ అభ్యర్థి మమతా బెనర్జీ (Mamata Banerjee ) దూసుకుపోతున్నారు. సమీప ప్రత్యర్థి, భాజపా నేత ప్రియాంక టిబ్రివాల్​కు అందనంత ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆరు రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యేసరికి మమతా బెనర్జీ 23,957 ఓట్ల ముందంజలో ఉన్నారు.

భవానీపుర్​లో(Bhabanipur by poll) దీదీకి అసలు ఎదురే లేదని ఈ ఉప ఎన్నికతో మరోసారి నిరూపితమైంది. తొలి రౌండ్​లోనే స్పష్టమైన ఆధిక్యాన్ని సంపాదించారు. ఆ తర్వాత రౌండ్ రౌండ్​కూ మెజారిటీ పెరుగుతూ వస్తోంది. తొలిరౌండ్​ పూర్తయ్యే సరికి.. 3,680, రెండో రౌండ్ తర్వాత 3,861, నాలుగో రౌండ్ అనంతరం 12,435 మెజారిటీ సంపాదించారు. మొత్తం 21 రౌండ్ల పాటు కౌంటింగ్ జరగనుంది.

ఆ రెండింటిలోనూ..

మరోవైపు, బంగాల్​లో ఉపఎన్నిక జరిగిన మరో రెండు నియోజకవర్గాల్లోనూ టీఎంసీదే హవా నెలకొంది. సంసేర్​గంజ్, జంగీపుర్​ స్థానాల్లో కౌంటింగ్ జరుగుతుండగా.. ఇక్కడి నుంచి పోటీ చేసిన తృణమూల్ అభ్యర్థులే ఆధిక్యంలో ఉన్నారు. ఈ రెండు స్థానాలు సైతం టీఎంసీ ఖాతాలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

నవంబర్ 30న ఈ మూడు స్థానాలకు ఉప ఎన్నిక జరిగింది. భవానీపుర్​లో 53 శాతం పోలింగ్ నమోదు కాగా.. సంసేర్​గంజ్, జంగీపుర్ స్థానాల్లో వరుసగా 78.60, 76.12 శాతం ఓట్లు పోలయ్యాయి.

ఇదీ చదవండి: దారుణం.. ఆరేళ్ల బాలుడ్ని సుత్తితో కొట్టి చంపిన బంధువులు

Last Updated : Oct 3, 2021, 12:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.