ETV Bharat / bharat

20 అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం- ఏడుగురు మృతి

author img

By

Published : Jan 22, 2022, 9:46 AM IST

Updated : Jan 22, 2022, 11:53 AM IST

major fire breaks out in Mumbai high-rise
major fire breaks out in Mumbai high-rise

09:42 January 22

20 అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం- ఏడుగురు మృతి

బహుళ అంతస్తుల భవనంలో చెలరేగిన మంటలు

Mumbai Fire: మహారాష్ట్ర ముంబయిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. టార్డియోలోని భాటియా ఆస్పత్రి సమీపంలో.. 20 అంతస్తుల భవనంలోని 18వ ఫ్లోర్​లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందారు. మరో 10 మందికిపైగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కమలా బిల్డింగ్​లో ఈ ఉదయం 7 గంటల సమయంలో మంటలు చెలరేగాయని ముంబయి మేయర్​ కిశోరి పెడ్నేకర్​ పేర్కొన్నారు.

సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే.. పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ అలుముకుంది.

ఇదో విచారకర ఘటన అని అన్నారు మహారాష్ట్ర భాజపా అధ్యక్షుడు మంగల్​ లోధా.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: లఖింపుర్‌ ఘటనలో మరో ఛార్జ్‌షీట్‌.. రైతులపైనా అభియోగాలు..

Last Updated : Jan 22, 2022, 11:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.