ETV Bharat / bharat

'మహా' కల్లోలం- కొత్తగా 67వేల మందికి కరోనా​​

author img

By

Published : Apr 22, 2021, 8:59 PM IST

దేశవ్యాప్తంగా కొవిడ్​ ఉద్ధృతి కొనసాగుతోంది. మహారాష్ట్రలో ఒక్కరోజే 67,013 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయింది. కరోనాతో మరో 568 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర్​ప్రదేశ్​లో ఒక్కరోజే 34,379 కరోనా కేసులు నమోదయ్యాయి.

corona
మహారాష్ట్రలో కరోనా కేసులు

దేశంలో కరోనా కోరలు చాస్తోంది. రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో ఒక్కరోజే 67,013 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయింది. కరోనాతో మరో 568 మంది మరణించారు. ఉత్తర్​ప్రదేశ్​లో వైరస్​ పంజా విసురుతోంది. గురువారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 34,379 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ ధాటికి మరో 195 మంది మరణించారు.

మిగతా రాష్ట్రాల్లో కేసులు ఇలా..

  • కర్ణాటకలో కొవిడ్​ పంజా విసురుతోంది. ఒక్కరోజే రికార్డు స్థాయిలో 25,795 మందికి వైరస్ నిర్ధరణ అయింది. వైరస్ కారణంగా మరో 123 మంది బలయ్యారు.
  • కేరళలో గురువారం ఒక్కరోజే 26,995 మంది కరోనా బారినపడ్డారు. వైరస్ ధాటికి మరో 28 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • గుజరాత్​లో రికార్డు స్థాయిలో ఒక్కరోజే 13,105 కేసులు నమోదయ్యాయి. రికార్డు స్థాయిలో 137 మంది వైరస్​తో మరణించారు.
  • తమిళనాడులో కొత్తగా 12,652 మందికి వైరస్​ పాజిటివ్​ నిర్ధరణ అయింది. మరో 59 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • మధ్యప్రదేశ్​లో గురువారం ఒక్కరోజే 12,384 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్​తో మరో 75 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి: ప్రభుత్వ మార్గాల ద్వారానే టీకా సరఫరా: ఫైజర్‌

ఇదీ చూడండి: వైరస్​ మృత్యుఘంటికలు- ఆక్సిజన్​ అందక విలవిల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.