ETV Bharat / bharat

ఫోన్ కోసం అక్కాతమ్ముళ్ల గొడవ- చూస్తుండగానే విషం తాగి...

author img

By

Published : Sep 13, 2021, 11:41 AM IST

girl sucide over mobile phone games
ఫోన్​ గేమ్స్ విషయంలో గొడవ

మొబైల్ ఫోన్​లో గేమ్స్​ ఆడే​ విషయంలో అక్కాతమ్ముళ్ల మధ్య తలెత్తిన గొడవ.. విషాదానికి దారి తీసింది. కోపోద్రిక్తురాలైన ఓ టీనేజ్​ బాలిక.. ఎలుకల్ని చంపే విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది.

ఫోన్ విషయంలో తన తమ్ముడితో గొడవ పడిన ఓ 16 ఏళ్ల బాలిక.. ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మహారాష్ట్ర ముంబయిలో(Maharashtra Mumbai News) జరిగింది.

అసలేమైందంటే..?

ముంబయిలోని కాందివలీ(Kandivali Maharashtra) తూర్పు ప్రాంతానికి చెందిన ఓ బాలికకు(16) ఇద్దరు చెల్లెళ్లు, ఓ తమ్ముడు ఉన్నాడు. వారి తండ్రి ఆటో రిక్షా డ్రైవర్​. ఆరుగురు సభ్యులున్న ఆ కుటుంబమంతా ఒకే ఫోన్​ను వాడుతున్నారు. శనివారం రాత్రి తనను ఫోన్​లో గేమ్స్​ ఆడనివ్వటం లేదని సదరు బాలిక తన తమ్ముడితో గొడవకు దిగింది.

ఈ క్రమంలో కోపోద్రిక్తురాలైన ఆమె.. సమీపంలోని ఓ దుకాణం నుంచి ఎలుకలను చంపే విషం తెచ్చుకుంది. కుటుంబ సభ్యులంతా చూస్తుండగానే.. దాన్ని తాగిందని ఎస్​ఐ సంతోష్​ ఖర్దే తెలిపారు. వెంటనే కుటుంబ సభ్యులు.. ఆమెను శతాబ్ది ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారని చెప్పారు. అక్కడ ఆమెకు చికిత్సకు స్పందించలేదని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: దివ్యాంగుల సాహసం.. పర్వతారోహణలో ప్రపంచ రికార్డు!

ఇదీ చూడండి: కళాఖండాల కోసం ఖండాతరాల వేట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.