అమరావతిలో ఘోరం.. బ్రిడ్జ్​పై నుంచి పడిన కారు, బైక్.. ఆరుగురు మృతి

author img

By

Published : Jul 18, 2022, 4:42 PM IST

Maharashtra Amravathi accident

Amravathi SUV accident: ద్విచక్రవాహనాన్ని ఓ ఎస్​యూవీ ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఓ వంతెనపై ఈ ప్రమాదం జరిగింది. అనంతరం రెండు వాహనాలు నాలాలో పడిపోయాయి.

Maharashtra Amravathi accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అమరావతి జిల్లాలో ఓ ఎస్​యూవీ బ్రిడ్జి పైనుంచి నాలాలో పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు. ఒకరికి గాయాలయ్యాయి. ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. పరాఠ్వాడా బైతుల్ రహదారిపై ఉన్న నింభోరా ఫాటా మలుపు వద్ద కారు ప్రమాదానికి గురైందని చెప్పారు. భారీ వర్షాల వల్ల రహదారి సరిగా కనిపించకుండా ఉందని.. ఈ క్రమంలోనే కారు అదుపుతప్పి బ్రిడ్జి నుంచి పక్కకు వెళ్లి ఉంటుందని పోలీసులు వివరించారు.

"ఎస్​యూవీ, ఓ ద్విచక్రవాహనం పరాఠ్వాడా నుంచి బోదాడ్​కు వెళ్తున్నాయి. నింభోరా ఫాటా వద్ద ఎస్​యూవీ డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. ఈ క్రమంలోనే కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఎస్​యూవీలో ఐదుగురు ప్రయాణిస్తుండగా.. అందులో నలుగురు చనిపోయారు. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు."
-పోలీసులు

ప్రమాదం అనంతరం రెండు వాహనాలు వంతెన పైనుంచి నాలాలో పడిపోయాయి. దీంతో ఆ దారిలో వెళ్లే వాహనదారులకు అక్కడ ప్రమాదం జరిగినట్లు తెలియలేదు. ఆదివారం రాత్రి 11.40 గంటలకు రెండు వాహనాలను నాలాలో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అంతకు రెండు గంటల ముందే ప్రమాదం జరిగి ఉండొచ్చని చెప్పారు. ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు.. నాలాలో కారు సీటు కనిపించింది. అప్రమత్తమై పరిశీలించగా ప్రమాదం జరిగినట్లు తెలిసింది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.