సీరియల్​ కిల్లర్​కు జీవితఖైదు.. 30 మంది చిన్నారులపై హత్యాచారం!

author img

By

Published : May 25, 2023, 10:50 PM IST

man raped and murdered 30 minors in dilhi

2015లో చిన్నారిని కిడ్నాప్​ చేసి హత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తికి జీవిత ఖైదు విధించింది దిల్లీ రోహిణి కోర్టు. దాదాపు 30 మంది మైనర్​లపై ఈ తరహా ఘటనలకు పాల్పడినట్లు నిందితుడు అంగీకరించినా.. సరైన ఆధారాలు లేని కారణంగా జీవిత ఖైదుతోనే సరిపెట్టింది కోర్టు.

ఆరేళ్ల బాలికను కిడ్నాప్​ చేసి హత్యాచారం చేసిన కేసులో రవీందర్ కుమార్​ అనే వ్యక్తికి జీవిత ఖైదు విధించింది దిల్లీ రోహిణి కోర్టు. బాధితురాలి కుటుంబానికి రూ.15లక్షలు సైతం నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీని అదేశించింది. కాగా రవీందర్​ కుమార్.. గతంలోను ఈ తరహా దారుణాలకు పాల్పడ్డాడు. దాదాపు అతడు 30 మంది చిన్నారులను అపహరించి హత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. దీనిని నిందితుడు సైతం అంగీకరించాడు. ఇంతకుముందు కూడా ఓ కేసులో రవీంద్ర కుమార్​.. దోషిగా తేలాడు. మరో కేసు కోర్టులో పెండింగ్​లో​ ఉంది.

2015లో రవీందర్​ కుమార్​.. ఆరేళ్ల బాలికను కిడ్నాప్ చేసి హత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో రవీందర్​ కుమార్​పై బేగంపుర్​ పోలీసు స్టేషన్​లో కేసు నమోదు చేశారు పోలీసులు. అనంతరం రోహిణి ప్రాంతంలోని సుఖ్‌బీర్ నగర్ బస్టాండ్ వద్ద దిల్లీ పోలీసులు ఇతడ్ని అరెస్ట్ చేశారు. డజన్ల కొద్దీ కెమెరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు విశ్లేషించారు. ఇదే కేసులో ప్రస్తుతం రవీంద్ర కుమార్​కు శిక్ష విధించింది రోహిణి కోర్టు. ఇతడికి 30 మంది మైనర్లను చంపిన కేసులో ప్రమేయం ఉందని.. అందుకే రవీందర్​ కుమార్​కు ఉరిశిక్ష విధించాలని బాధితురాలి తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అయితే అందుకు తగ్గ ఆధారాలు లేని కారణంగా నిందితుడికి మరణ శిక్ష విధించలేమని కోర్టు సృష్టం చేసింది. కాగా నేరస్థుడు నిరుపేద కుటుంబానికి చెందినవాడని.. అతడి పట్ల కనికరం చూపాలని రవీంద్ర తరపు న్యాయవాది కోర్టును అభ్యర్థించాడు.

ఉత్తర్​ప్రదేశ్​లోని కాస్​గంజ్ జిల్లాకు చెందిన రవీందర్ కుమార్​.. 18 ఏళ్ల వయస్పప్పుడు 2008లో ఉద్యోగం కోసం దిల్లీకి వచ్చాడు. అనంతరం మద్యానికి, డ్రగ్స్​కు అలవాటు పడ్డాడు. దాంతో పాటు పోర్న్​ వీడియోలకు సైతం విపరీతంగా చూసేవాడు. 6 నుంచి 12 ఏళ్ల మధ్య చిన్నారులను రవీందర్​ కుమార్​ లక్ష్యంగా చేసుకునేవాడు. డ్రగ్స్ తీసుకున్న తరువాత రవీందర్​ కుమార్​.. చిన్నారుల కోసం వెతికే వాడని పోలీసుల విచారణలో తేలింది. రవీందర్​ కుమార్​పై 2008- 2015 మధ్య దాదాపు 30 మంది మైనర్​లను కిడ్నాప్​, చేసి హత్యచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

"రవీందర్​ కుమార్​ పగటి పూట పనిచేసి.. రాత్రి సమయంలో మురికి వాడల్లో నిద్రించేవాడు. డ్రగ్స్ తీసుకున్న తర్వాత మురికివాడ నుంచి బయటకు వచ్చి.. చిన్నపిల్లల కోసం వెతికేవాడు." అని పోలీసులు తెలిపారు. చిన్నారుల కోసం ఒక రోజు ఏకంగా 40 కిలో మీటర్లు నడిచినట్లు.. రవీంద్ర కుమార్​ తన విచారణలో తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. చిన్నారులకు పది రూపాయల నోటు, చాక్లెట్లు ఆశచూపి నిర్మానుష్య ప్రదేశాలకు తీసుకెళ్లేవాడని వివరించారు. రవీందర్​ను ఇదే కేసులో గతంలోను రెండుసార్లు అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. చిన్నారిని కిడ్నాప్​ చేసి సెప్టిక్​ ట్యాంక్​లో పడేశాడన్న ఆరోపణలు సైతం ఇతడిపై ఉన్నాయన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.