ETV Bharat / bharat

కరోనా విలయం: ఒక్క రోజులో 1,61,736 కేసులు

author img

By

Published : Apr 13, 2021, 9:22 AM IST

దేశంలో కరోనా 2.0 ఉగ్రరూపం దాల్చుతోంది. కొత్తగా 1,61,736 మందికి వైరస్​ సోకినట్టు తేలింది. కొవిడ్​​ బారినపడిన వారిలో మరో 879 మంది ప్రాణాలు కోల్పోయారు.

latest corona cases in india
కరోనా విలయం: ఒక్క రోజులో 1,61,736 కేసులు

దేశంలో కొవిడ్​ విలయ తాండవం కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో రోజువారి కొత్త కేసులు పెరిగిపోతున్నాయి. సోమవారం ఒక్కరోజే 1,61,736 మంది మహమ్మారి బారినపడ్డారు. వైరస్​ ధాటికి మరో 879 మంది బలయ్యారు.

  • మొత్తం కేసులు: 1,36,89,453
  • మొత్తం మరణాలు: 1,71,058
  • కోలుకున్న వారు: 1,22,53,697
  • యాక్టివ్​ కేసులు: 12,64,698

కొవిడ్​ సోకిన వారిలో 97,168 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా సోమవారం ఒక్కరోజే 14 లక్షల 122 నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్​) తెలిపింది.

ఒక్కరోజే 40.04 లక్షల డోసుల వ్యాక్సిన్​ పంపిణీ చేసినట్టు ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 10.85 కోట్ల​ డోసుల్ని పంపిణీ చేసినట్టు తెలిపింది.

ఇదీ చదవండి : 'కరోనా వేళ 35 లక్షల మంది పుణ్యస్నానాలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.