ETV Bharat / bharat

బస్సును కొట్టేసి పరారైన దొంగలు.. కానీ...

author img

By

Published : Oct 19, 2021, 2:27 PM IST

KSRTC bus stolen from the bus station in Tumkur
బస్సును కొట్టేసి పరారైన దొంగలు

బస్టాండ్​లో పార్క్ చేసిన ఓ బస్సుపై ఆ దొంగల కన్ను పడింది. పక్కా ప్లాన్​తో ఎవరూ లేని సమయం చూసి కొట్టేశారు. అదే బస్సులో పరిసర గ్రామాల్లో చక్కర్లు కొట్టారు. చివరకు ఏమైందంటే?

కర్ణాటకలో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా బస్​ స్టేషన్​లో ఉన్న బస్సునే కొట్టేశారు.

వివరాల ప్రకారం.. తుమకూరు జిల్లా గుబ్బి బస్టాండ్​లో పార్క్​ చేసి ఉన్న బస్సును దొంగిలించారు దుండగులు. ఆ బస్సుతోనే కునిగల్​ పరిసర ప్రాంతాల్లో చక్కర్లు కొట్టారు. బస్సులో డీజిల్​ మొత్తం అయిపోయాక.. జన్నెనహళ్లి గ్రామం వద్ద దానిని వదిలి పారిపోయారు.

KSRTC bus stolen from the bus station in Tumkur
బస్సును కొట్టేసి పరారైన దొంగలు

గుబ్బి బస్​ స్టేషన్​లో సీసీటీవీ కెమెరాలు కూడా లేవు. బస్సు డ్రైవర్​, ఆపరేటర్​ నిర్లక్ష్యం కారణంగానే.. బస్సు చోరీకి గురైందని అధికారులు అంటున్నారు.

యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఇదీ చూడండి: 100 కోట్ల ప్రయాణం.. ఇంకా సగం మిగిలే ఉంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.