ETV Bharat / bharat

8 జిల్లాలకు కలెక్టర్లుగా 'పవర్​ఫుల్​' మహిళలు

author img

By

Published : Jul 9, 2021, 4:55 PM IST

Kerala's way of women empowerment
కేరళలో 8 జిల్లాలకు కలెక్టర్లుగా మహిళలు

కేరళ ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించింది. మొత్తం 14 జిల్లాలకు గానూ 8 జిల్లాలకు కలెక్టర్లుగా మహిళా అధికారులను నియమించింది. మహిళా సాధికారతకు ప్రాధాన్యమిచ్చి మరోసారి ప్రత్యేకతను చాటుకుంది.

కేరళ ప్రభుత్వం తొలిసారి మెజారిటీ జిల్లాలకు కలెక్టర్లుగా మహిళా అధికారులను నియమించింది. మొత్తం 14 జిల్లాలకు గానూ 8 జిల్లాలకు వారినే ఎంపిక చేసింది. కాసర్​గోడ్ జిల్లా చరిత్రలోనే మొట్ట మొదటిసారి ఓ మహిళా ఐఏఎస్ అధికారి కలెక్టర్​ పగ్గాలు చేపట్టారు. మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తూ కేరళ సర్కార్ తన మార్క్ పాలనను మరోసారి చాటిచెప్పింది.

8 జిల్లాల మహిళా కలెక్టర్ల వివరాలు..

  1. తిరువనంతపురం- డా. నవజోత్​ ఖోస
  2. పథానంతిట్ట- డా.దివ్య అయ్యర్​
  3. కొట్టాయం- డా.పీకే జయశ్రీ
  4. ఇడుక్కి- షీబ జార్జ్
  5. త్రిస్సూర్​- హరిత వి కుమార్​
  6. పాలక్కడ్​- మృన్మయి జోషి
  7. వయనాడ్​- డా.అధీలా అబ్దుల్లా
  8. కాసర్​గోడ్​- భండారి స్వాగత్​ రణ్వీర్​చాంద్

ఈ ఎనిమిది మంది మహిళా కలెక్టర్లలో ముగ్గురు డాక్టర్లు కావడం గమనార్హం.

ఇవీ చదవండి: కేరళలో జికా వైరస్​ విజృంభణ- మరో ముప్పుగా మారేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.