ETV Bharat / bharat

కేరళలో 7లక్షలు దాటిన కరోనా కేసులు

author img

By

Published : Dec 19, 2020, 9:17 PM IST

Kerala's COVID-19 cases tally crosses 7 lakh mark
కేరళలో 7లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కొత్త కేసుల సంఖ్య తగ్గినా.. ఆయా రాష్ట్రాల్లో మాత్రం ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. కేరళలో మరో 6,293 మంది వైరస్​ బారినపడ్డారు. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 7 లక్షలు దాటింది. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 2,786 మంది కొవిడ్​కు బలయ్యారు.

కేరళలో కరోనా వైరస్​ ఆందోళనకర స్థాయిలో విస్తరిస్తోంది. కొద్దిరోజులుగా రోజుకు సగటున 5వేల మందికిపైగా కొవిడ్​ బారినపడుతున్నారు. శనివారం ఒక్కరోజే 6,293 వైరస్​ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా బాధితుల సంఖ్య 7లక్షలు దాటింది. మహమ్మారి ధాటికి మరో 29 మంది మరణించగా.. మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2,786కు పెరిగింది.

  • మహారాష్ట్రలో మరో 3,940 మందికి కరోనా​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 18.92 లక్షలకు పెరిగింది. వైరస్​తో పోరాడుతూ మరో 74 మంది చనిపోగా.. మృతుల సంఖ్య 48వేల 648కి ఎగబాకింది.
  • ఉత్తర్​ప్రదేశ్​లో ఒక్కరోజులోనే 1,226 మంది కొవిడ్​ బారినపడ్డారు. కేసుల సంఖ్య 5.73 లక్షలకు ఎగబాకింది. వైరస్ ధాటికి మరో 24 మంది బలవ్వగా.. చనిపోయిన వారి సంఖ్య 8,177కు చేరింది.
  • దేశ రాజధాని దిల్లీలో మరో 1,139 కరోనా కేసులు బయటపడ్డాయి. బాధితుల సంఖ్య 6లక్షల 15వేలు దాటింది. దిల్లీలో ఇప్పటివరకు 10,251 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
  • కర్ణాటకలో శనివారం రోజు 1,152 కొత్త కేసులు వెలుగు చూశాయి. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 9లక్షల 8వేల 275కు చేరింది. వైరస్​తో మరో 15 మంది చనిపోగా.. మరణాల సంఖ్య 12వేలు దాటింది.
  • మధ్యప్రదేశ్​లో మరో 1,085 మందికి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. దీంతో కేసుల సంఖ్య 2.30 లక్షలకు చేరింది. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 3,468 మందిని కొవిడ్​ బలితీసుకుంది.

ఇదీ చదవండి: కరోనా కారణంగా 700మందిని కోల్పోయాం: రైల్వే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.