ETV Bharat / bharat

కేరళలో కరోనా విజృంభణ- అదే కారణమా?

author img

By

Published : Aug 25, 2021, 7:11 PM IST

Updated : Aug 25, 2021, 10:48 PM IST

Kerala cases
కేరళలో కరోనా కేసులు

కేరళలో కరోనా(Corona cases) ఉద్ధృతి తారస్థాయికి చేరింది. కొత్తగా 31 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మే నెల తర్వాత ఇదే అత్యధికం కావడం గమనార్హం.

కేరళలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. బుధవారం ఒక్కరోజే 31 వేల 445 కొత్త కరోనా కేసులు నమోదవ్వగా గడిచిన 24 గంటల్లో మహమ్మారితో 215 మంది మృత్యువాత పడ్డారు. గత మే నెల తర్వాత నేడు మళ్లీ భారీ స్థాయిలో కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. కొవిడ్ పాజిటివ్ రేటు 19 శాతం మార్క్‌ను దాటినట్లు వివరించారు.

ఓనమ్‌ పండుగ నేపథ్యంలో పాజిటివ్‌ రేటు 20 శాతం దాటుతుందని వైద్య నిపుణులు ముందుగానే అంచనా వేశారు. ఈ ఏడు బక్రీద్‌ అనంతరం కేరళలో రోజూ 20 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 20 వేల 271 మంది మహమ్మారి బారి నుంచి కోలుకోగా ప్రస్తుతం లక్షా 70 వేల 292 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

మరో వైపు మహారాష్ట్రలో కొత్తగా 5,031 కరోనా కేసులు వెలుగు చూశాయి. మరో 216 మంది చనిపోగా.. కొత్తగా 4,380 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.

దేశ రాజధాని దిల్లీలో.. 35 మందికి వైరస్​ సోకింది. వైరస్​ కారణంగా ఒకరు మృతి చెందారు.

ఇతర రాష్ట్రాల్లో ఇలా..

  • తమిళనాడులో 1,573 మంది మహమ్మారి బారినపడ్డారు. 1,797 మంది వైరస్ నుంచి కోలుకోగా.. మరో 27 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • కర్ణాటకలో కొత్తగా 1,224 కరోనా కేసులు నమోదయ్యాయి. 1,668 మంది కోలుకోగా.. 22 మంది మృతిచెందారు.
  • ఒడిశాలో కొత్తగా 887 మందికి కరోనా సోకగా.. 69 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • జమ్ముకశ్మీర్​లో 125, గోవాలో 77, నాగాలాండ్​లో 49, గుజరాత్​లో​ 17, మధ్యప్రదేశ్​లో 5 కరోనా కొత్త కేసులు వెలుగు చూశాయి.

టీకా పంపిణీ రికార్డు..

దేశవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీలో సరికొత్త రికార్డ్​ నమోదైంది. ఇప్పటివరకు మొత్తంగా 60 కోట్ల మందికి వ్యాక్సిన్​ వేసినట్లు కేంద్రం తెలిపింది. ఒక్కరోజులోనే 66 లక్షల మందికి పైగా టీకా తీసుకున్నట్లు పేర్కొంది.

ఇదీ చూడండి: Vaccine Side Effects: భారత్​లో కరోనా టీకా వల్ల సైడ్​ ఎఫెక్ట్స్​ తక్కువే!

Last Updated :Aug 25, 2021, 10:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.