ETV Bharat / bharat

'మా​ ప్రభుత్వాన్ని బలహీన పరిచేందుకే ఆ బిల్లు'

author img

By

Published : Mar 17, 2021, 7:40 PM IST

Aravind Kejriwal
సీఎం కేజ్రీవాల్‌

దిల్లీ లెఫ్టినెంట్​ గవర్నర్​కు మరిన్ని అధికారాలు కట్టబెట్టే చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టింది ఆమ్​ ఆద్మీ పార్టీ. తమ ప్రభుత్వాన్ని బలహీన పరచాలని కేంద్రం చూస్తోందని ఆరోపించింది. ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేసింది.

దేశ రాజధాని దిల్లీలో లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌కు మరిన్ని అధికారాలు కట్టబెట్టేందుకు తెచ్చిన జీఎన్​సీటీడీ బిల్లును.. కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని సీఎం కేజ్రీవాల్‌ కోరారు. తమ ప్రభుత్వాన్ని బలహీన పరచాలని కేంద్రం చూస్తోందని ఆరోపించారు.

లెఫ్టినెంట్​ గవర్నర్​ అధికారాల సవరణ బిల్లుకు వ్యతిరేకంగా జంతర్‌ మంతర్‌ వద్ద ఆమ్‌ ఆద్మీ పార్టీ భారీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సభలో పాల్గొని ప్రసగించిన కేజ్రీవాల్‌ కేంద్రపై విమర్శలు గుప్పించారు. ఈ చట్టం ద్వారా ప్రజలను మోసం చేయొద్దని కేంద్రానికి..కేజ్రీవాల్‌ సూచించారు. తమ అభివృద్ధిని భాజపా ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటుందని ప్రశ్నించారు. వెంటనే ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చూడండి: బంగాల్​ దంగల్​: కీలక స్థానాల్లో జంప్​జిలానీల పాగా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.