ఇంట్లో నెమళ్ల పెంపకం.. అటవీ అధికారులు తనిఖీలు.. నిందితుడు అరెస్ట్

author img

By

Published : Jul 14, 2022, 10:45 AM IST

Updated : Jul 14, 2022, 11:39 AM IST

karnataka peacocks raising in house

నెమళ్లను ఇంట్లో పెంచుతున్న ఓ వ్యక్తిని అరెస్టు చేశారు అటవీ అధికారులు. ఈ ఘటన కర్ణాటకలో బుధవారం జరిగింది. నిందితుడిపై పలు సెక్షన్లు కింద కేసు నమోదు చేశారు.

ఇంట్లో నెమళ్లు పెంచుతున్న ఓ వ్యక్తిని అటవీ శాఖ అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. ఈ ఘటన కర్ణాటక.. మైసూర్​ జిల్లా కామెగౌడనహళ్లిలో జరిగింది. నిందితుడిని మంజు నాయక్​గా గుర్తించారు. మొబైల్ విజిలెన్స్​ స్క్వాడ్ ఆధ్వర్యంలో మంజు నాయక్​ ఇంటిపై దాడులు జరపగా.. అతడు అనేక నెమళ్లను పెంచుతున్నట్లు తేలింది.

karnataka peacocks raising in house
మైసూర్​లో ఇంట్లో నెమళ్లను పెంచుతున్న వ్యక్తి

నిందితుడి ఇంట్లో దాడి జరిపి ఓ పెద్ద నెమలిని అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద మంజు నాయక్​పై కేసు నమోదు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. 1972లో నెమలికి జాతీయ పక్షిగా గుర్తింపు లభించింది. హిందువులు నెమలిని పవిత్రంగా పూజిస్తుంటారు. అయితే, నెమలి పింఛం, మాంసం కోసం వీటిని దుండగులు వేటాడుతున్నారు.

ఇవీ చదవండి:

స్నేహితులతో కలిసి భార్యపై గ్యాంగ్​రేప్.. పెళ్లి చేసుకుంటానని చెప్పి మైనర్​పై..

మళ్లీ జికా వైరస్​ కలకలం.. ఏడేళ్ల బాలికకు పాజిటివ్​

Last Updated :Jul 14, 2022, 11:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.