ETV Bharat / bharat

లోయలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు యువకులు దుర్మరణం

author img

By

Published : Jan 4, 2022, 11:03 PM IST

car karada ghat
యువకులు దుర్మరణం

Karnataka Accident News: కర్ణాటకలోని కందమల్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘాట్​ రోడ్డులో ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం

Karnataka Accident News: కర్ణాటకలోని కందమల్​ జిల్లాలో విషాద ఘటన వెలుగుచూసింది. తొమ్మిది మందితో ప్రయాణిస్తున్న ఓ కారు కరాడ ఘాట్​ రోడ్డు వద్ద అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. జిల్లాలోని రైకియా పోలీస్​ స్టేషన్​ పరిధిలో మంగళవారం ఈ దుర్ఘటన జరిగింది.

మృతిచెందిన యువకులలో ఇద్దరు భలియాపాడకు చెందిన లియాదాస్​ పారిచ్చా, పబన్​ దిగల్​గా పోలీసులు గుర్తించారు. మరో వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇదీ చూడండి : మహారాష్ట్రలో 18 వేలు- బంగాల్​లో 9 వేల కొత్త కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.