ETV Bharat / bharat

8 నెలల గర్భంతో 12 కిమీ నడిచి భర్తపై ఫిర్యాదు

author img

By

Published : May 29, 2021, 9:51 PM IST

Updated : May 29, 2021, 10:15 PM IST

భర్త వేధింపులు తాళలేక ఓ నిండు గర్భిణి నానా అవస్థలు పడింది. భర్తపై ఫిర్యాదు చేసేందుకు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఠాణాకు నడుచుకుంటూ వెళ్లింది. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.

pregnant women
గర్భిణి, భర్త వేధింపులు

భర్త వేధింపులు భరించలేక 12 కిలో మీటర్లు నడుచుకుంటూ పోలీసు స్టేషన్​కు వెళ్లి ఫిర్యాదు చేసింది ఓ 8 నెలల గర్భిణి. ఈ ఘటన కర్ణాటక కమలాపుర్​లోని కలబురగిలో జరిగింది.

pregnant women
బాధితురాలు

ఇదీ జరిగింది..

బందనకేర తండాకు చెందిన చినబాయ్ అనే గర్భిణి.. తీవ్ర వేధింపులకు గురైనట్లు తెలిపింది. కట్నం తీసుకురావాలంటూ తన భర్త, ఆయన సోదరుడు తీవ్రంగా ఒత్తిడి చేసినట్లు పేర్కొంది. ఈ మేరకు పోలీసులకు పిర్యాదు చేసేందుకు 12 కిలోమీటర్లు నడుచుకుంటూ ఠాణాకు వచ్చినట్లు తెలిపింది.

Harassment
12 కిలోమీటర్లు నడిచిన బాధితురాలు

తన భర్త సునీల్​కు ఇదివరకే రెండు వివాహాలు జరిగాయని చినబాయ్ ఆరోపించింది. తాగుడుకు బానిసై.. తనను మానసికంగా, శారీరకంగా వేధించ సాగాడని పేర్కొంది. అయితే.. సునీల్​కు గతంలోనే రూ. లక్ష అందించినట్లు బాధితురాలి తల్లి చెప్పింది.

ఇదీ చదవండి:ఉపాధ్యాయురాలి వేధింపులు తాళలేక వ్యక్తి ఆత్మహత్య!

Last Updated : May 29, 2021, 10:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.