ETV Bharat / bharat

'జనవరి 26 హింస' ప్రభుత్వ ప్రణాళికే: టికాయిత్​

author img

By

Published : Mar 21, 2021, 5:40 AM IST

కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు భారతీయ కిసాన్​ యూనియన్​ అధ్యక్షుడు నరేశ్​ టికాయత్​. జనవరి 26న జరిగిన హింస వెనుక భాజపా ప్రభుత్వమే ఉందని ఆరోపించారు. తాము ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకమని ఉద్ఘాటించారు.

గణతంత్ర దినోత్సవం రోజు దిల్లీలో జరిగిన హింసకు భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమే కారణమని ఆరోపించారు భారతీయ కిసాన్​ యూనియన్(బీకేయూ)​ అధ్యక్షుడు నరేశ్​ టికాయత్​. ఇది రైతులను అవమానించడమేనని అన్నారు.

ఉత్తర్​ప్రదేశ్​లోని పోవాయాలో నిర్వహించిన 'కిసాన్​ మహాపంచాయత్'​లో ఆయన మాట్లాడారు. ట్రాక్టర్​ ర్యాలీలో చెలరేగిన హింసలో నిందితులు కూడా ప్రభుత్వానికి చెందినవారేనని అన్నారు.

''దిల్లీలో హింస ప్రణాళికను స్వయంగా భాజపా ప్రభుత్వమే రూపొందించింది. ఇది రైతులను అవమానించడమే.''

- నరేశ్​ టికాయత్​, బీకేయూ అధ్యక్షుడు​

రైతులకు అతిపెద్ద శత్రువు భాజపా ప్రభుత్వమేనని టికాయత్​ విమర్శించారు. రైతులంతా ఏకం అవ్వాలని, లేదంటే వారు ఇంకా విధ్వంసానికి తెగిస్తారని ఆరోపించారు. శ్రీరాముని పేరు చెప్పి.. బంగాల్​లో భాజపా ఓట్లు అడుగుతుందని అన్నారు.

''రైతులను ఉగ్రవాదులు, ఖలిస్థానీలు అని ఇంకా ఏదేదో అన్నారు. కానీ మేం ప్రభుత్వ వ్యతిరేకులం. మేం ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకం.''

- నరేశ్​ టికాయత్​, బీకేయూ అధ్యక్షుడు

ప్రతి రైతు కుటుంబం నుంచి ఒకరు గాజీపుర్​లోని నిరసన ప్రదేశానికి వెళ్లాలని పిలుపునిచ్చారు. ​

ఇవీ చూడండి:

'ఏ పార్టీకైనా ఓటేయండి- భాజపాకు మాత్రం వేయకండి'

'అడ్డంకులు తొలగించి.. చర్చలు జరపండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.