ETV Bharat / bharat

Janasena on Telangana Assembly Elections : తెలంగాణ ఎన్నికల్లో పోటీపై రెండు మూడ్రోజుల్లో జనసేన క్లారిటీ

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 18, 2023, 1:40 PM IST

Janasena on Telangana Assembly Elections 2023 : రాష్ట్రంలో ఎన్నికల దృష్ట్యా జనసేన నాయకులు, కార్యకర్తలు జనసేన అధ్యక్షుడు పవన్​ కల్యాణ్​ను కలిశారు. ఎన్నికల్లో పోటీ విషయంలో నాయకుల అభిప్రాయాలను పవన్​తో పంచుకున్నారు. అనంతరం రెండు మూడు రోజులల్లో తమ నిర్ణయం తెలియజేస్తామని జనసేన పార్టీ తెలిపింది.

Janasena Decision on Telangana Elections
Telangana Janasena Leaders Meet Pawan Kalyan

Janasena on Telangana Assembly Elections 2023 : తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా రాజకీయ పార్టీలన్నీ పోరుకు సన్నద్ధం అవుతున్నాయి. ఆయా పార్టీలు తమ అభ్యర్ధులను బరిలో దించేందుకు కసరత్తు చేస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 119 నియోజకవర్గాలు ఉన్నాయి. ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్​ఎస్​, కాంగ్రెస్​, బీజేపీ, బీఎస్పీ, వైఎస్సాఆర్​ తెలంగాణ పార్టీలు ఇప్పటికే సిద్ధమవుతున్నాయి. టీడీపీ కూడా పోటీ చేస్తున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్​ తెలిపారు. ఈ క్రమంలో ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో మరో రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని జనసేన తెలిపింది.

Telangana Janasena Leaders Meet Pawan Kalyan : తెలంగాణలో ఎన్నికల తేదీలు ఖరారు అయినందున రాష్ట్ర జనసేన నాయకులు(Janasena Leaders), కార్యకర్తలు హైదరాబాద్​లోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్​(Pawan Kalyan)తో భేటీ అయ్యారు. ఎన్నికల పోటీపై పార్టీ నేతల్లో సందిగ్ధత ఏర్పడంతో తమ అభిప్రాయాలను వన్​కు వివరించినట్లు రాష్ట్ర నాయకత్వం వెల్లడించింది. గత ఎన్నికలు జరిగినప్పుడు.. కొత్త రాష్ట్రంలో రాజకీయ గందరగోళానికి తావివ్వరాదని పోటీకి దూరంగా ఉన్నామని స్పష్టం చేసింది. పార్టీకి మిత్రపక్షమైన బీజేపీ విజ్ఞప్తి మేరకు హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలకు దూరంగా ఉన్నామని పేర్కొంది. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకుంటే క్యాడర్​ బలహీనపడే అవకాశం ఉందనే విషయాన్ని పవన్​ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పింది.

JanaSena Contest in Telangana : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో జనసేన.. ఈ స్థానాల్లో పోటీకి సిద్ధం

Telangana Assembly Elections 2023 : రాష్ట్ర కార్యాలయంలో నాయకుల అభిప్రాయాలను విన్న పవన్​ కల్యాణ్​.. ఎన్నికల దృష్ట్యా తన మీద ఒత్తిడి ఉన్న మాట నిజమేనని, నాయకులు, జనసైనికుల అభిప్రాయాలకు విలువ ఇస్తానని తెలిపారు. ఎన్నికల పోటీ విషయంలో రెండు మూడు రోజుల్లో నిర్ణయం చెబుతామని తెలిపారు. బీజేపీతో కలిసి వెళ్లాలో వద్దో అనే విషయంలో జనసేన నాయకుల అభిప్రాయాలను పవన్ తెలుసుకున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేస్తూ.. ఎక్స్(ట్విటర్​)​లో ట్వీట్​ చేసింది. ఈ సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్​ రెడ్డి, తెలంగాణ శాఖ ఇన్​ఛార్జి నేమూరి శంకర్​ గౌడ్​, రాష్ట్ర నాయకులు రామ్​ తాళ్లూరి, ప్రధాన కార్యదర్శి దామోదర్​ రెడ్డి, హైదరాబాద్​ నగర అధ్యక్షుడు రాజలింగం, వివధ నియోజకవర్గాల ఇన్​ఛార్జులు పాల్గొన్నారు.

pawan kalyan: టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ.. సూచనప్రాయంగా వెల్లడించిన పవన్‌

Mulakhat with Chandrababu: చంద్రబాబుతో పూర్తయిన ములాఖత్.. పొత్తులపై పవన్ కీలక వ్యాఖ్యలు

Case on Pawan Kalyan: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై కేసు నమోదు.. ఆ సెక్షన్లు కలిపి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.