ETV Bharat / bharat

బాధపెట్టా.. నన్ను క్షమించండి: జైరాం​ రమేష్​

author img

By

Published : Dec 19, 2020, 5:19 PM IST

jai
జైరామ్​ రమేష్​

జాతీయ భద్రతా సలహాదారు అజిత్​​ డోభాల్​ కుమారుడు వివేక్​ డోభాల్​కు​ కాంగ్రెస్ సీనియర్​​ నాయకుడు జైరాం​ రమేష్​ క్షమాపణలు చెప్పారు. 2019 నాటి పరువు నష్టం కేసుకు సంబంధించి దిల్లీ హైకోర్టులో మన్నించమని కోరారు.

జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్​ కుమారుడు.. వివేక్​ డోభాల్​కు కాంగ్రెస్​​ సీనియర్​ నాయకుడు జైరాం​ రమేష్ క్షమాపణలు చెప్పారు. 2019 నాటి పరువు నష్టం కేసుకు సంబంధించి దిల్లీ హైకోర్టులో క్షమాపణలు కోరారు. తన పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేసినందుకుగాను జైరాం​ రమేష్​, కారవాన్​ మ్యాగజైన్​పై వివేక్​ డోభాల్ 2019లో​ పరువు నష్టం కేసును నమోదు చేశారు.

"కారవాన్​ మ్యాగజైన్​లో ప్రచురితమైన కథనాలను ఆధారంగా చేసుకుని వివేక్​పై వ్యాఖ్యలు చేశాను. వివేక్​, అతని కుటుంబ సభ్యులకు బాధకలిగిస్తే మన్నించండి. ఆ న్యూస్​ వెబ్​సైట్​లో వెలువడిన వార్తలను తొలగించండి."

- జైరాం రమేష్​

2019లో జనవరి 17న జరిగిన మీడియా సమావేశంలో వివేక్ డోభాల్, అతని కుటుంబంతో పాటు వ్యాపార సంస్థ జీఎన్​ఏ ఆసియా ఫండ్​పై కాంగ్రెస్​ సీనియర్​ నేత ఆరోపణలు చేశారు. అప్పట్లో సాధారణ ఎన్నికల ముందు ఆ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ప్రస్తుతం జైరాం​ క్షమాపణలను వివేక్​ స్వీకరించారు.

ఇదీ చూడండి:సువేందు సహా 10 మంది ఎమ్మెల్యేలు భాజపా గూటికి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.