ISRO successfully launches first scientific satellite XPoSat: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కొత్త సంవత్సరాన్ని విజయోత్సాహంతో ప్రారంభించింది. తిరుపతి జిల్లా సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ-సీ58 (PSLV-C58) వాహకనౌక ‘ఎక్స్-రే పొలారిమీటర్ ఉపగ్రహం’తో సోమవారం ఉదయం 9:10 గంటలకు నింగిలోకి దూసుకెళ్లి విజయవంతమైంది. నిన్న ఉదయం 8:10 గంటలకు ప్రారంభమై 25 గంటల కౌంట్డౌన్ అనంతరం షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.
పీఎస్ఎల్వీ-సీ58 లో మన దేశానికి చెందిన 480 కిలోల బరువు గల ఎక్స్పోశాట్ (XPoSat) ను అంతరిక్షంలోకి పంపించారు. ప్రయోగించిన అనంతరం 21 నిమిషాలకు ఎక్స్పోశాట్ నిర్ణీత కక్ష్యలోకి చేరింది. ఈ ప్రయోగం సాయంతో ఇస్రో శాస్త్రవేత్తలు పలు అంశాలపై అధ్యయనం చేయనున్నారు.
రేపు పీఎస్ఎల్వీ-సీ58 ప్రయోగం - తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు
ఎక్స్-రే మూలాలను అన్వేషించడం: ఎక్స్పోశాట్ భారతదేశం అంతరిక్ష ఆధారిత ఎక్స్-రే ఖగోళ శాస్త్రంలో సంచలనాత్మక పురోగతికి నాంది కానుందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. ఎక్స్-రే మూలాలను అన్వేషించడమే ప్రధాన లక్ష్యంగా ప్రయోగం చేసినట్లు వెల్లడించారు. ఇమేజింగ్, టైం-డొమైన్ అధ్యయనాలతో పాటుగా స్పెక్ట్రోస్కొపీపై ప్రధానంగా దృష్టి సారించిన మునుపటి మిషన్ల మాదిరిగా కాకుండా ఎక్స్-రే ఖగోళ శాస్త్రానికి ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తుందన్నారు.
ఈ తరహ ప్రయోగం చేయడం ఇది రెండోవదని, కొత్త ఏడాది కొత్త విజయాన్ని అందుకున్నామని సోమనాథ్ తెలిపారు. గగన్యాన్ ప్రయోగానికి సంబంధించి నాలుగు టెస్టు ప్రయోగాలు చేయాల్సి ఉందన్నారు. గగన్యాన్ మ్యాన్ మిషన్ 2025లో జరుగుతుందన్నారు. నాసా, ఇస్రో సంయుక్తంగా చేయబోయే GSLV-ఇన్ శాట్3డీ పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. మరో జీఎస్ఎల్వీ ద్వారా నావిక్ ఉపగ్రహం నింగిలోకి పంపుతామన్నారు. 2024లో నెలకో ప్రయోగం ఉంటుందని సోమనాథ్ వెల్లడించారు. ఆదిత్యాలో అమర్చిన 9ప్యాలోడ్స్ పని చేస్తున్నాయన్నారు.
ఇలాంటి ప్రయోగం అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేసిందని తెలిపారు. ఆ తర్వాత ఈ ప్రయోగాన్ని చేసింది మనేమనన్నారు. అమెరికా 2021లో ఐఎక్స్పీఈ పేరిట ఈ తరహా ప్రయోగం నిర్వహించినట్లు వివరించారు. ఎక్స్పోశాట్ జీవితకాలం అయిదేళ్లు ఉంటుందని తెలిపారు. కృష్ణబిలాలను అర్థం చేసుకోవడం ఈ మిషన్ ప్రధాన ఉద్దేశమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఎక్స్రే ఫొటాన్లు, వాటి పొలరైజేషన్పై అధ్యయనం చేస్తుందని, తద్వారా కృష్ణబిలాలు, న్యూట్రాన్ స్టార్ల దగ్గర రేడియేషన్కు సంబంధించిన వివరాలను ఎక్స్పోశాట్ బహిర్గతం చేస్తుందని సోమనాథ్ వెల్లడించారు.
విమెన్ ఇంజినీర్డ్ శాటిలైట్: పీఎస్ఎల్వీ చివరి దశలో మరో పది పరికరాలను అంతరిక్షానికి మోసుకెళ్లింది. ఈ ప్రయోగానికి పీఎస్ఎల్వీ ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ అని పేరు పెట్టారు. దీంట్లోనే తిరువనంతపురం ఎల్బీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్ కాలేజ్ విద్యార్థినులు తయారుచేసిన విమెన్ ఇంజినీర్డ్ శాటిలైట్ను ఉంచారు.
'కొత్త ఏడాది కొత్త విజయాన్ని అందుకున్నాం. పీఎస్ఎల్వీ-సీ58 వాహకనౌక కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఎక్స్-రే మూలాలను అన్వేషించడమే ప్రధాన లక్ష్యంగా ప్రయోగం చేశాం. ఈ ఎక్స్పోశాట్ ఉపగ్రహ ఐదేళ్లపాటు సేవలను అందించనుంది. 2021లో అమెరికా ఈతరహా ఐఎక్స్పీఈ ప్రయోగం నిర్వహించింది. అమెరికా తర్వాత ఇలాంటి ప్రయోగం చేసిన ఘనతను భారతదేశం దక్కించుకుంది. సైన్స్ రంగంలో మహిళా సాధికారతను ప్రదర్శిస్తుంది. -'ఇస్రో ఛైర్మన్ సోమనాథ్
Aditya L1 Mission : 'అంతరిక్ష రంగంలో భారత్ పాత్ర పెరుగుతోంది'.. 'ఆదిత్య' విజయం కోసం హోమాలు, పూజలు