ETV Bharat / bharat

ఇండిగో విమానంలో మంటలు.. టేకాఫ్ సమయంలో ఇంజిన్ ఫెయిల్.. లక్కీగా..

author img

By

Published : Oct 29, 2022, 8:11 AM IST

IndiGo planes engine catches fire
IndiGo planes engine catches fire

దిల్లీ నుంచి బెంగళూరుకు వెళ్లాల్సిన ఓ ఇండిగో విమానంలో మంటలు చెలరేగాయి. టేకాఫ్ సమయంలో ఇంజిన్​లో మంటలు వచ్చినట్లు.. వెనకవైపు ఉన్న మరో విమానం పైలట్ గుర్తించారు.

ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. దిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బెంగళూరుకు వెళ్తున్న విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. టేకాఫ్‌ అవుతున్న సమయంలో ఇంజిన్‌లో చెలరేగిన మంటలను గుర్తించిన వెనక ఉన్న స్పైస్‌జెట్‌ విమాన పైలట్‌... అధికారులకు సమాచారమిచ్చి, అత్యవసరంగా ల్యాండింగ్‌ చేశారు.

ఘటన సమయంలో విమానంలో మెుత్తం 177 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసి అందులోని ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వివరించారు. శుక్రవారం రాత్రి 10 గంటలకు ఈ ఘటన జరగ్గా.. విమానంలో ఉన్న ఓ ప్రయాణికుడు వీడియో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

కాగా, ఈ ఘటనపై డీజీసీఏ స్పందించింది. విమానం రెండో ఇంజిన్​లో తలెత్తిన వైఫల్యాల వల్ల మంటలు చెలరేగినట్లు డీజీసీఏ తెలిపింది. ఈ సమయంలో భారీ శబ్దాలు వచ్చాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో విమానం టేకాఫ్ అయ్యేందుకు అనుమతి నిరాకరించినట్లు వివరించింది. విమానాన్ని పూర్తిగా పరిశీలిస్తున్నట్లు స్పష్టం చేసింది. 'డీజీసీఏ తరఫున ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేస్తాం. ఘటనకు కారణాలేంటన్న విషయాలను కనుగొంటాం. అందుకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటాం' అని డీజీసీఏ స్పష్టం చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.