ETV Bharat / bharat

'వచ్చే ఏడాదికి స్వదేశీ విమాన వాహక నౌక'

author img

By

Published : Jun 25, 2021, 3:04 PM IST

భారత్​ స్వాదేశీ పరిజ్ఞానంతో నిర్మిస్తున్న విమాన వాహక నౌకను వచ్చే ఏడాది అందుబాటులోకి తీసుకురానున్నట్లు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ తెలిపారు. ఆత్మనిర్భర భారత్​లో భాగంగా దీనిని రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు.

rajnath sing
రాజ్​నాథ్​ సింగ్​

భారత తొలి స్వదేశీ విమాన వాహక నౌక-ఐఏసీని వచ్చే ఏడాది అందుబాటులోకి తెస్తున్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. విమాన వాహక నౌక నిర్మాణంలో సాధించిన పురోగతిని ఆయన సమీక్షించారు. ఐఏసీని దేశ శక్తిసామర్థ్యాలకు నిదర్శనంగా అభివర్ణించారు.

వచ్చే ఏడాది ప్రారంభించనున్న ఐఏసీని.. 75వ స్వాతంత్య్ర దినోత్సవానికి అంకితం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

విమాన వాహక నౌకను కేరళలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో రూపొందిస్తున్నారు.

ఇదీ చూడండి: Emergency: 'నాటి చీకటి రోజులను మరువలేం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.