ETV Bharat / bharat

రాష్ట్రపతి ముర్ముకు కంటి ఆపరేషన్​.. ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

author img

By

Published : Oct 16, 2022, 3:04 PM IST

Updated : Oct 16, 2022, 3:39 PM IST

భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు కంటి శస్త్రచికిత్స జరిగింది. కొద్ది రోజులు విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి భవన్​ ప్రతినిధి అధికారకంగా వెల్లడించారు.

indian president draupadi murmu
భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

Indian President: భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఎడమ కంటికి శస్త్రచికిత్స జరిగింది. దిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో ఎస్​కే మిశ్ర, ఆయన వైద్య బృందం ముర్ముకు ఆదివారం ఉదయం 11:30 గంటలకు ఆపరేషన్​ చేశారు. సర్జరీ విజయవంతం కాగా.. మధ్యాహ్నం 1:30 గంటలకు ముర్మును డిశ్చార్జ్ చేశారు. రాష్ట్రపతికి కొద్దిరోజుల విశ్రాంతి అవసరం అని వైద్యులు తెలిపారు.

'ఈ రోజు ఆమెకు ఆపరేషన్​ విజయవంతంగా జరిగింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్​ అయ్యారు. ప్రస్తుతం కొద్ది రోజులు విశ్రాంతి అవసరం అని వైద్యులు తెలిపారు' అని రాష్ట్రపతి భవన్​ ప్రతినిధి అధికారికంగా వెల్లడించారు. 64 ఏళ్ల ద్రౌపదీ ముర్ము భారతదేశానికి 15వ రాష్ట్రపతిగా.. జూలై 25 2022న బాధ్యతలు చేపట్టారు.

Last Updated : Oct 16, 2022, 3:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.